దీనస్థితిలో టాలీవుడ్ స్టార్ కమెడియన్.. పట్టించుకోని స్టార్స్!
'దుబాయ్ శీను' సినిమాలో హోటల్ సీన్ లో "ఏం తీసుకుంటారు" అని వేణుమాధవ్ అడగ్గానే.. "మూడు ఊతప్ప, ఒక రవ్వ దోస, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ" అంటూ కమెడియన్ రామచంద్ర చెప్పిన తీరు భలే ఉంటుంది. ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది. అంతలా నవ్వించిన రామచంద్ర.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమై, సాయం కోసం ఎదురుచూస్తున్నారు.