English | Telugu

రామోజీరావు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. ఆ రోజు ఇంటికి కేక్ పంపించి కోయించారు 

ప్రముఖ సినీ నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ అధినేత,'రామోజీరావు'(Ramoji Rao)గారు, బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి 'ఈటీవీ' (Etv)అనే ఛానల్ ని స్థాపించిన విషయం తెలిసిందే. 1995 అగస్ట్ 27 న ప్రారంభమైన   'ఈటీవీ' ప్రస్తుతం పలు ఛానల్స్ ని అనుసంధానంగా చేసుకొని భారతదేశంలోని పలు భాషల్లో  విస్తరించి ఉంది. సదరు చానల్స్ లో వచ్చే కార్యక్రమాలన్నీ  ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తు వస్తున్నాయి. రీసెంట్ గా  ఈటీవీ 30 వ వార్షికోత్సవ వేడుకలు ఫిలింసిటీలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ముఖ్య అతిధిగా హాజరయ్యారు.