English | Telugu

సొంత మనుషులే శ్రీహరి ఆస్తులు కొట్టేశారు!

తెలుగు సినీ పరిశ్రమలో దివంగత నటుడు శ్రీహరికి ఎంతో గొప్ప పేరుంది. ఎదుటివారికి సాయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుండే వారు. ఎందరికో డబ్బు సాయం, మాట సాయం చేసి అండగా నిలబడ్డారు. అలాంటి శ్రీహరి కుటుంబాన్ని కొందరు మోసం వేసి, విలువైన ఆస్తులను కొట్టేశారు. ఈ విషయాన్ని శ్రీహరి సతీమణి డిస్కో శాంతి స్వయంగా చెప్పడం విశేషం.

తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు శాంతి. "బావ(శ్రీహరి) ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉన్నా కూడా.. అర్థరాత్రి 2-3 గంటల వరకు మేల్కొని ఎందరో సమస్యలను పరిష్కరించిన రోజులు ఉన్నాయి. ఆయన దానం చేస్తుంటే నేనెప్పుడూ వద్దని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేస్తుంది మంచే కదా. మనం మంచి చేస్తే.. దేవుడు మనల్ని మంచిగా చూసుకుంటాడని నేను నమ్ముతాను." అని శాంతి అన్నారు.

శ్రీహరి ఆస్తుల గురించి శాంతి మాట్లాడుతూ.. "సినిమాల్లో శ్రీహరి బాగానే సంపాదించారు. వాటిలో మా అవసరాలకు ఉంచుకొని.. ఎక్కువగా దానం చేసేవారు. నేను కూడా తినడానికి, ఉండటానికి ఉంటే చాలని చెప్పేదాన్ని. ఆస్తుల్లో సగానికి పైగా స్నేహితులే మోసం చేసి కొట్టేశారు. ఎవరి పాపాన వాళ్ళే పోతారని వదిలేశాను. శ్రీహరి గారు చనిపోయాక ఇబ్బందులు పడ్డాము. ఇక్కడి ఆస్తుల విలువ మాకు తెలియకపోవడంతో.. తక్కువ ధరకే కొందరు కాజేశారు. కొంతకాలం తిండికి కూడా కష్టమైంది. బంగారం తాకట్టు పెట్టాను. మా అన్నయ్య ఖర్చులకు డబ్బులు పంపారు." అని చెప్పారు.

"మేము ఆస్తులు కూడపెట్టుకున్నామని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కువగా దానాలే చేశాము. శ్రీహరి చనిపోయాక డబ్బులు ఇవ్వాల్సిన కూడా ఇవ్వలేదు. ఇప్పుడు లైఫ్ పరవాలేదు. జాగ్రత్తగా ఉంటున్నాము. ఉన్నది కాపాడుకుంటున్నాము. భవిష్యత్ లో మా పిల్లలు మళ్ళీ సంపాదించుకుంటారు." అంటూ శాంతి చెప్పుకొచ్చారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.