English | Telugu

వంగవీటి సినిమా నిర్మాత అరెస్ట్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అభిమానిగా గుంటూరు జిల్లా తెనాలిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన దాసరి కిరణ్ కుమార్(Dasari Kirankumar)ఆ పై నిర్మాతగా మారి రామదూత క్రియేషన్స్ పై 'జీనియస్, వంగవీటి, వ్యూహం వంటి పలు సినిమాలని నిర్మించాడు.

రీసెంట్ గా దాసరి కిరణ్ పై గాజుల మహేష్(Gajula Mahesh)అనే ట్రావెల్ ఏజెన్సీ నడుపుకునే వ్యక్తి ఈ నెల 18 న విజయవాడ పడమట పిఎస్ లో ఫిర్యాదు చేసాడు. తన ఫిర్యాదులో కిరణ్ నా వద్ద రెండు సంవత్సరాల క్రితం, వ్యాపార నిమిత్తం 4.5 కోట్ల రూపాయిలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నా భార్యతో పాటు విజయవాడలో ఉన్న కిరణ్ ఆఫీస్ కి వెళ్ళాను. కానీ కిరణ్ మనుషులు మమల్ని బయటకి నెట్టి వెయ్యడమే కాకుండా, దాడి చేసి గాయపరిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కిరణ్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ కి తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

వ్యూహం చిత్రంలో అవాస్తవాలని వాస్తవాలుగా చూపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu),ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిరంజీవిని పలు రకాలుగా విమర్శించడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.