English | Telugu
రాత్రికి రాత్రే 9 సినిమాల నుంచి తీసేసారు.. ఐరన్ లెగ్ అనే బిరుదు ఖాయమంటారా!
Updated : Jul 10, 2025
భారతీయ సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు 'విద్యాబాలన్'(Vidya Balan). రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన తన సినీ జర్నీలో ఎన్నో హిట్ సినిమాలు ఉండటంతో పాటు ఆయా చిత్రాల్లోని పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' లో ఆమె పోషించిన టైటిల్ రోల్ నే అందుకు ఉదాహరణ. గత ఏడాది హర్రర్ కామెడీ 'భూల్ భూలయ్య 3 ' లో మంజులిక, మల్లికా అనే రెండు వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో అలరించింది.
విద్యాబాలన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ మొదట్లో 'మోహన్ లాల్'(Mohanlal)సరసన చక్రం అనే మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను. కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకోవడంతో మూవీ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత అనుకోకుండా ఆగిపోయింది. మోహన్ లాల్ కి, చిత్ర నిర్మాతకి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతోనే ఆగిపోయింది. కానీ నా వల్లే ఆగిపోయిందనే ప్రచారం చేసి ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. ఫలితంగా చక్రంతో పాటు ఒప్పకున్న తొమ్మిది దక్షిణాది చిత్రాల నుంచి నన్ను తొలగించేసారు. ఆ ప్రభావం నా కెరీర్ పై పడింది. కానీ అమితాబచ్చన్ లాంటి వాళ్ళు ప్రారంభంలో తిరస్కరణకి గురయ్యారని తెలిసి ముందుకు సాగాను. విశ్వాసంతో ముందుకు సాగితే ఖచ్చితంగా మన రోజు అంటు వస్తుందని చెప్పుకొచ్చింది.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి తారకరామారావు'(Ntr)జీవిత కథ ఆధారంగా అయన తనయుడు గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)నటించి, రూపొందించిన చిత్రాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకమ్మ' క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి తెలుగు ప్రేక్షకుల్ని కూడా విద్యా బాలన్ తన నటనతో మెప్పించింది.