English | Telugu

ఎన్టీఆర్‌ న్యూ లుక్‌పై పెరిగిన ట్రోలింగ్‌.. తిప్పికొడుతున్న ఫ్యాన్స్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కి ముందు, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత అన్నట్టుగా పెరిగిపోయింది. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్‌ కన్‌ఫర్మ్‌ అనే సెంటిమెంట్‌ని దేవరతో బ్రేక్‌ చేశారు ఎన్టీఆర్‌. ఇప్పుడు ఎన్టీఆర్‌ ప్రపంచస్థాయి హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల వార్‌2తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌కు చుక్కెదురైంది. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.


కెజిఎఫ్‌ సిరీస్‌, సలార్‌ వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్న ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ ఓ పాన్‌ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారని చెప్పుకుంటున్నారు. అయితే ఇది అనఫీషియల్‌ న్యూస్‌ మాత్రమే. ఈ సినిమా కోసం తన లుక్‌ని పూర్తిగా మార్చుకుంటున్నారు ఎన్టీఆర్‌. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫిజికల్‌ ట్రైనింగ్‌ స్టిల్స్‌ బయటికి వచ్చాయి.


ఇదిలా ఉంటే.. మలబార్‌ గోల్డ్‌ సంస్థకు ఎన్టీఆర్‌ చేసిన కొత్త యాడ్‌లో ఎన్టీఆర్‌ లుక్‌పై రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి. చాలాకాలంగా ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఎన్టీఆర్‌ గతంలో దీని కోసం చాలా యాడ్స్‌ చేశారు. అయితే ఇంతకుముందు యాడ్స్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కి, తాజాగా వచ్చిన యాడ్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కి చాలా తేడా కనిపించింది. అంతకుముందు ఎనర్జిటిక్‌గా కనిపించిన ఆయన.. కొత్త యాడ్‌లో ఆ స్థాయి ఎనర్జీ కనిపించకపోవడం, గడ్డం తీరులో కూడా ఎంతో మార్పు ఉండడమే ట్రోలింగ్‌కి కారణమవుతోంది. దీంతో నెటిజన్లు ఎన్టీఆర్‌ లుక్‌పై కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ లుక్‌ ఎన్టీఆర్‌కి సెట్‌ అవ్వలేదని, హెయిర్‌ స్టైల్‌ కూడా బాగాలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌ అంతకంతకు పెరిగిపోతుండడంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగి వాటిని తిప్పికొడుతున్నారు.


పెద్ద హీరోలెవరైనా తాము చేసే పాత్రల కోసం రకరకాల లుక్స్‌ ట్రై చెయ్యడం సహజమేనని, దాన్ని తప్పుగా చూడడం కరెక్ట్‌ కాదని అంటున్నారు. సినిమాలోని లుక్‌ కంటే ఆ పాత్రను ఎంత సమర్థవంతంగా పోషించాడు అనేది ముఖ్యమని ఫ్యాన్స్‌ సమాధానమిస్తున్నారు. సినిమా పరంగా కాకుండా, ఒక యాడ్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కి ఈ స్థాయిలో చర్చ జరగడం అనేది ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌కి నిదర్శమని అర్థమవుతోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.