English | Telugu

రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు.. ఇదెక్కడి జాతర స్వామీ?

- సంక్రాంతికి భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి
- ర‌వితేజ స‌ర‌స‌న ఆరుగురు హీరోయిన్లు
- శివ నిర్వాణ డైరెక్ష‌న్‌లో సినిమా


ఒకప్పుడు మాస్‌ హీరోగా చక్రం తిప్పిన మాస్‌ మహారాజ్‌ రవితేజకు ఇటీవలికాలంలో హిట్‌ అనేది కరువైంది. క్రాక్‌, ధమాకా వంటి హిట్‌ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న రవితేజ హీరోగా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవల విడుదలైన మాస్‌ జాతర కూడా అలాంటి ఫలితాన్నే ఇచ్చింది.


ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పేరుతో ఓ విభిన్న చిత్రం చేస్తున్నారు రవితేజ. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమా రిలీజ్‌ అవ్వకముందే మరో ప్రాజెక్ట్‌ని సెట్‌ చేసుకొని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఏదీ రాలేదు. అయినప్పటికీ లేటెస్ట్‌ న్యూస్‌ పేరుతో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలో నిజం లేదని చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది. ఈ సినిమాకి సంబంధించి తాము అఫీషియల్‌గా ఇచ్చే అప్‌డేట్‌ను మాత్రం నమ్మాలని ప్రేక్షకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు మేకర్స్‌.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.