English | Telugu

చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్.. అసలేం జరుగుతోంది..?

Publish Date:Dec 12, 2025

  మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ అన్నదమ్ముల అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.   చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవన్ కళ్యాణ్ నుండి రానున్న నెక్స్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2026 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.     Also Read: 'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. అఖండకు రెట్టింపు..!   'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ 'దేఖ్ లేంగే సాలా' డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే టైంలో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ టీమ్ భారీ ప్రెస్ మీట్ ని ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.     డిసెంబర్ 13 సాయంత్రం 5:30 కి గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు తాజాగా ప్రకటించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మూవీ సాంగ్ లాంచ్ ఉండగా.. చిరంజీవి మూవీ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటం ఏంటనేది అభిమానులకు అర్థం కావట్లేదు.    'ఉస్తాద్ భగత్ సింగ్' సాంగ్ లాంచ్ గురించి అవగాహన లేక 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారా? లేదా తెలిసే ఇలా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.  

Mowgli 2025 Movie Review

Publish Date:Dec 12, 2025

Cast: Roshan Kanakala, Sakshi Sagar Mhadolkar, Bandi Saroj Kumar, Harsha Chemudu Crew:  Written by Rama Maruthi, Radhakrishna Reddy, Sandeep Raj Music by Kaala Bhairava Cinematography by Rama Maruthi Editing by Kodati Pavan Kalyan Directed by Sandeep Raj Produced by T.G. Vishwa Prasad, Krithi Prasad Sandeep Raj delivered an OTT hit with Colour Photo film, 5 years ago during pandemic. He took time due to various reasons to start his next film, Mowgli 2025. The movie stars Roshan Kanakala. Sakshi Sagar is playing as a specially abled female lead whose is deaf and mute while Bandi Saroj Kumar, who built a cult for himself with YouTube releases is playing a protagonist. People Media Factory have produced the film and movie released on 13th December 2025. Let's discuss about the film in detail.   Plot:  Murali Krishna aka Mowgli (Roshan Kanakala) is an orphan and he makes his living by staying in nearby forest village. He has a close friend Bunty (Harsha Chemudu), who is ready to give life for him. Mowgli has an aim to become a Police Officier, like his deceased father. To achieve that, he keeps helping a location co-ordinator. He is disrespected by some and respected by some but he doesn't care about it all. He keeps giving and loving people.  During a shoot, he meets dancer Jasmine (Sakshi Sagar) and woes her. He doesn't back out even after knowing she is deaf and mute. A police officer Christoper Nolan (Bandi Saroj Kumar) likes to use women and he decides to trap Jasmine. He uses all tricks to break the lovers but Mowgli gets to know the reality of all the misunderstandings and expresses his love for her. She experiences her father like love when she is with him and accepts him. But Nolan starts to plot against them. What will he do? How can Mowgli win against him? Watch the movie to know more.  Analysis: A routine story always needs a fresh perspective and presentation. Here, writer-director Sandeep Raj tried to infuse that freshness by making the lead a deaf and mute. But he did not write a very convincing love story between them. It just feels like rather them falling in love, the story is more about Nolan aka Bandi Saroj Kumar's character. There is no proper build-up or sequences that really stick to your heart about both the young leads falling in love.  The writing needed to be more focused on how these two got attracted to each other rather than trying to play the orphan card. The build of trust between both of them who know the hardships of life is just missing. The script writing looks more inspired from old movies than trying to build on something fresh with new characters. It is more like you know the beats and hence, we are going to play around with the same rather than offer you anything of significance.  Comedy, emotions and characters are written in so amatuerish way that writing is the most disappointing part of the film. Roshan Kanakala as a performer is good and Sakshi Sagar has likeable energy. But their chemistry doesn't lit up the screen and it feels like more forced to come together. Bandi Saroj Kumar is exceptional and he has great screen presence. But the underwhelming writing, even undermines his performance big time.  Kaala Bhairava's music is good but it doesn't really fit the film. He tried his best to elevate and engage but writing and execution are too underwhelming. Sandeep Raj showcased that he has talent to carve out emotional scenes in Colour Photo but here he just goes over board and doesn't really engage in any emotion. Even editing and cinematography are sub-standard. Production values are fine but overall, the movie is a major disappoint.  Bottomline: Nothing works while Bandi Saroj Kumar, leads did try their best to elevate a disappointing script. Misfire.     Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

Akhanda 2 Movie Review

Publish Date:Dec 11, 2025

విక్టరీ వెంకటేష్‌ హీరో అవ్వడానికి కారణం సూపర్‌స్టార్‌ కృష్ణ. ఎలాగంటే..?

Publish Date:Dec 12, 2025

(డిసెంబర్‌ 13 విక్టరీ వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా..) సినిమాలపై ఆసక్తి లేకపోయినా కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చిత్రరంగంలోకి ప్రవేశించి అనూహ్య విజయాలు సాధించిన వారిలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్‌ ఎంతోమంది ఉన్నారు. అలా నటనపై అవగాహనగానీ, ఆసక్తిగానీ లేకుండా హీరో అయిపోయిన వారిలో దగ్గుబాటి వెంకటేష్‌ ఒకరు. 1986లో  హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్‌.. ఈ 39 సంవత్సరాల్లో 76 సినిమాల్లో నటించారు. వీటిలో చంటి  హిందీ రీమేక్‌గా వచ్చిన ‘అనాడి’, యమలీల హిందీ రీమేక్‌గా వచ్చిన ‘తక్‌దీర్‌వాలా’ ఉన్నాయి.    1963లో నిర్మాతగా చిత్ర రంగ ప్రవేశం చేసిన మూవీమొఘల్‌ డా.డి.రామానాయుడు.. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి అగ్రనిర్మాతగా ఎదిగారు. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు సురేష్‌, వెంకటేష్‌. వీరిద్దరి పేరుమీద స్థాపించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపైనే సినిమాలు నిర్మించేవారు. ఈ సంస్థ లోగోపై ఇద్దరు పిల్లలు, ఎస్‌.. పి అనే అక్షరాలు ఉంటాయి. ఎస్‌ అక్షరంపై ఉన్న వెంకటేష్‌ స్టార్‌గా, పి అనే అక్షరంపై ఉన్న సురేష్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.    1960 డిసెంబర్‌ 13న కారంచేడులో డి.రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు జన్మించారు వెంకటేష్‌. అతని స్కూల్‌, కాలేజీ విద్యాభ్యాసం మద్రాస్‌లోనే జరిగింది. ఆ తర్వాత అమెరికాలో ఎంబిఎ పూర్తి చేశారు. స్టడీస్‌ పూర్తయిన తర్వాత ఇండియా వచ్చి అన్నయ్య సురేష్‌లా నిర్మాతగా లేదా బిజినెస్‌మేన్‌గా సెటిల్‌ అవ్వాలనుకున్నారు.    అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తూ వస్తున్న రామానాయుడు.. 1986లో కృష్ణ హీరోగా ఒక సినిమా నిర్మించేందుకు ప్లాన్‌ చేశారు. అయితే అప్పటికి కృష్ణ చాలా సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆయన డేట్స్‌ రామానాయుడుకి దొరకలేదు. అదే సమయంలో కృష్ణ చెప్పిన ఒక్క మాటతో వెంకటేష్‌ హీరో అయిపోయారు. ‘ఇప్పట్లో నా డేట్స్‌ ఖాళీ లేవు. అయినా మీ ఇంట్లోనే హీరోని పెట్టుకొని మరొకరితో సినిమా ఎందుకు.. మీ అబ్బాయి వెంకటేష్‌ బాగానే ఉన్నాడు. అతన్ని హీరో చేయండి’ అని సలహా ఇచ్చారు కృష్ణ.    అమెరికా నుంచి వచ్చిన వెంకటేష్‌తో అదే విషయం చెప్పారు రామానాయుడు. వెంకటేష్‌ షాక్‌ అయి తను హీరో ఏంటి అనుకున్నారు. ఎక్కువ కాలం అమెరికాలోనే ఉండడం వల్ల ఇంగ్లీషే ఎక్కువగా మాట్లాడేవారు. నటనలో అనుభవం లేకుండా, తెలుగు రాకుండా సినిమాలు ఎలా చెయ్యగలను అని తండ్రిని అడిగారు వెంకటేష్‌. కానీ, రామానాయుడు మాత్రం కొడుకుని హీరోని చెయ్యాలనే నిర్ణయించుకున్నారు. దానికి తగినట్టుగా వెంకటేష్‌కి శిక్షణ ఇప్పించారు. 1986లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా వెంకటేష్‌ని హీరోగా పరిచయం చేశారు రామనాయుడు. నటన కొత్త కావడంతో నటించడంలో, డైలాగులు చెప్పడంలో బాగా తడబడ్డారు. మొత్తానికి సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. ‘కలియుగ పాండవులు’ సూపర్‌హిట్‌ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. దాంతో వెంకటేష్‌కి కూడా ధైర్యం వచ్చింది.    అంతకుముందే 1971లో వచ్చిన ‘ప్రేమనగర్‌’ చిత్రంలో బాలనటుడిగా కనిపించారు వెంకటేష్‌. ఇదే సినిమాను తమిళ్‌లో ‘వసంత మాళిగై’గా రీమేక్‌ చేశారు రామానాయుడు. ఇందులో కూడా వెంకటేష్‌ నటించారు. ‘కలియుగ పాండవులు’ హిట్‌ తర్వాత అక్కినేని నాగేవ్వరరావుతో కలిసి ‘బ్రహ్మరుద్రులు’ చేశారు. ఆ మరుసటి ఏడాది 5 సినిమాల్లో హీరోగా నటించారు. అందులో ‘శ్రీనివాసకళ్యాణం’ వెంకటేష్‌కి మంచి పేరు తెచ్చింది.  ఆ వెంటనే కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘స్వర్ణకమలం’ వంటి క్లాస్‌ సినిమాతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.    1990లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ చిత్రం సాధించిన ఘనవిజయంతో కమర్షియల్‌ హీరోగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన చేరారు వెంకటేష్‌. ఆ తర్వాత వచ్చిన శత్రువు, కూలీ నెం.1, క్షణక్షణం, చంటి సుందరకాండ, కొండపల్లిరాజా, అబ్బాయిగారు వంటి సినిమాలతో స్టార్‌ హీరోగా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నారు. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ఆ క్రమంలోనే ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, రాజా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలతో ఫ్యామిలీ స్టార్‌ అయిపోయారు. ఇక అప్పటి నుంచి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వరకు అన్నిరకాల సినిమాలు చేస్తూ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌ హీరోగా కొనసాగుతున్నారు విక్టరీ వెంకటేష్‌.    యాక్షన్‌, సెంటిమెంట్‌, కామెడీలను అద్భుతంగా పండిరచగల హీరోల్లో వెంకటేష్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌ కామెడీ టైమింగ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇటీవలికాలంలో ఎఫ్‌2, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లోనూ తన కామెడీతో అలరించారు. అలాగే ఈనాడు, దృశ్యం సిరీస్‌, నారప్ప, గురు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.    చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న వెంకటేష్‌కి సక్సెస్‌ల శాతం ఎక్కువ. అందుకే విక్టరీని తన పేరుగా మార్చుకొని విక్టరీ వెంకటేష్‌ అయ్యారు. అలాగే ఎక్కువ రీమేక్‌లు చేసిన హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎక్స్‌పెరిమెంట్స్‌ చేయడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేష్‌.. ఆ తరహా సినిమాలు ఎన్నో చేసి సక్సెస్‌ సాధించారు.    ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఏడాది ముందే 1985లో వెంకటేష్‌ వివాహం నీరజతో జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వెంకటేష్‌.. షూటింగ్‌ తర్వాత కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఇష్టపడతారు.    ప్రస్తుతం వెంకటేష్‌ చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే.. నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన త్రివిక్రమ్‌ ఆ తర్వాత టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇటీవల ప్రారంభమైంది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంలో స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు విక్టరీ వెంకటేష్‌.

దురంధర్ కి హృతిక్ రోషన్ ఇచ్చిన రివ్యూపై విమర్శలు

Publish Date:Dec 11, 2025

      -హృతిక్ రివ్యూ ఎలా ఉంది  -విమర్శలకి కారణం ఏంటి! -200 కోట్ల క్లబ్ లోకి చేరువలో      బాలీవుడ్ స్టార్ హీరో 'రణవీర్ సింగ్'(Ranveer singh)ఇండియా వ్యాప్తంగా 'దురంధర్'(Dhurandhar)తో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కలెక్షన్స్ ని రాబడుతుందంటే దురంధర్ సాధించిన విజయం ఎంత స్పష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ రా పోలీస్ ఆఫీసర్ గా రణవీర్ పాకిస్థాన్ వెళ్లి అక్కడి తీవ్రవాదులని అంతమొందించే క్యారక్టర్ లో చేసిన పెర్ ఫార్మెన్స్ ని అందరు మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భగా వచ్చే కథ, నేపధ్యాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)ఒక ఇంటర్వ్యూ లో  దురంధర్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.     హృతిక్ మాట్లాడుతు 'దురంధర్' నాకు చాలా బాగా నచ్చింది. మూవీ అంటే ఇలాగే ఉండాలి.  ఇంత గొప్ప కథని సెల్యులాయిడ్ పైకి తీసుకొచ్చినందుకు మేకర్స్ కి నా అభినందనలు.  హృదయాన్ని హత్తుకునేలా తీర్చిదిద్దారు. కాకపోతే రాజకీయపరమైన అంశాలని చూపించిన విధానాన్ని అంగీకరించలేకపోతున్నాను. కానీ ఒక పేక్షకుడిగా సినిమాని ఆస్వాదించడంతో పాటు కథ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో హృతిక్ మాటలపై పలువురు  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మూవీలో కేవలం పాకిస్థాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని చూపించడంతో పాటు వాళ్ళు చేసే భయానక దాడుల్ని చూపించారు. ఆ విషయాలని ఎందుకు అంగీకరించలేకపోతున్నారని హృతిక్ ని ప్రశ్నిస్తున్నారు.     also read: దారుణమైన రీతిలో చిన్మయి మార్ఫింగ్ పిక్.. డబ్బులు తీసుకొని చేసింది వీళ్ళే      ఇక దురంధర్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా 2000 వ సంవత్సరం నేపథ్యంలో జరిగే కథాంశంతో తెరకెక్కింది. ఇప్పటికే 180 కోట్ల క్లబ్ లోకి చేరి రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది. రణవీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా,వంటి ప్రతిభావంతమైన నటుల పెర్ ఫార్మెన్స్  ఒక రేంజ్ లో ఉంది. ప్రతి ఫేమ్ లోను ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ కట్టిపడేస్తుండగా డిసెంబర్ 5 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.   

Thanuja second vote Appeal:రెండోసారి ఓట్ అప్పీల్ చేసుకున్న తనూజ.. పాపం సంజన!

Publish Date:Dec 12, 2025

బిగ్ బాస్ హౌస్ లో పద్నాలుగో వారం ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టాస్క్ లలో గెలిచి స్కోర్ బోర్డుపై ఎక్కువ పాయింట్లు కలిగిన కంటెస్టెంట్స్ తనూజ,ఇమ్మాన్యుయేల్, సంజన ముగ్గురు.  ఇక‌ వీరిలో మీతో పాటు ఓటు అప్పీల్ కి ఎవరిని తీసుకొని వెళ్తారు తనూజ అని బిగ్ బాస్ అడుగుతాడు. ఆల్రెడీ ఇమ్మాన్యుయేల్ కీ ఓటు అప్పీల్ ఛాన్స్ రావడంతో సంజనని సెలెక్ట్ చేసుకుంటుంది తనూజ. సంజన, తనూజ ఇద్దరు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ అడియన్స్ ఉంటారు. ఇద్దరిలో ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తారని బిగ్ బాస్ ఆడియన్స్ ని అడుగుతారు. ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు. దాంతో తనూజకి మళ్ళీ ఓటు అప్పీల్ ఛాన్స్ వస్తుంది. సంజన హౌస్ లోపలికి వెళ్తుంది. తనూజ ఓటు అప్పీల్ చేసుకుంటుంది. ఆడియన్స్ కొంతమంది తనూజని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు ప్రతీసారి ఏడుస్తారు ఎందుకు మీకు సింపథీ కోసమా అని ఒకావిడ అడుగుతుంది. అయ్యో అలా ఏం కాదండి.. ఎప్పుడు మా వాళ్ళు ఎవరో ఒకరు నాతో ఉండేవాళ్ళు కానీ హౌస్ లోకి వచ్చాక వీళ్ళు ఎవరో తెలియదు అలాంటప్పుడు ఎమోషనల్ అవ్వడం తప్పనిసరి అవుతుందని తనూజ చెప్తుంది. మీరు ఇమ్మాన్యుయేల్ మొహం పైనే.. నువ్వు నా ఫ్రెండ్ కాదని అన్నారు.. అలా అనడం కరెక్టేనా అని ఒక ఆడియన్ అడుగుతాడు. వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్.. మీకు క్లోజ్ ఫ్రెండ్ లేడా అని తనూజ అంటుంది. నేను అలా అనలేదని అతను అంటాడు. నేను హర్ట్ అయ్యాను.. వాడు హర్ట్ అవ్వాలి కదా అని తనూజ చెప్తుంది. అలా అతను అడిగే ప్రశ్నలకి తనూజ తడబడుతూ సమాధానం చెప్తుంది.

వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న!

Publish Date:Dec 9, 2025

  ఇంతవరకు డ్యూయల్ రోల్ చేయని మహేష్! ఇప్పుడు వారణాసిలో ఏకంగా ఐదు పాత్రల్లో సర్ ప్రైజ్!   హీరోగా రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో మహేష్ బాబు(Mahesh Babu) డ్యూయల్ రోల్ చేయలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. 'నాని' సినిమాలో మాత్రమే కాసేపు డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఫుల్ లెంగ్త్ లో ఇంతవరకు నటించలేదు. అలాంటి మహేష్ బాబు.. ఇప్పుడు రెండు పాత్రల్లో కాదు, ఏకంగా ఐదు పాత్రల్లో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో 'వారణాసి'(Varanasi) అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.    'వారణాసి'లో మహేష్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన లుక్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో శ్రీరాముడిగా కూడా మహేష్ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలతో పాటు.. మరో మూడు పాత్రలలో మహేష్ కనువిందు చేయనున్నాడట. అందులో ఒకటి శివుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. మిగతా రెండు పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. ఒక్కో పాత్రలో మహేష్ కనిపించే తీరు సర్ ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు.   Also Read: ఆ హీరోయిన్ తో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రెండో పెళ్లి..!   ఈ జనరేషన్ లో ట్రిపుల్ రోల్ చేయడమే అరుదు అయిపోయింది. అలాంటిది మహేష్ ఏకంగా ఐదు పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. పైగా దర్శకుడు రాజమౌళి కాబట్టి.. ప్రతి పాత్రని ఎంత గొప్పగా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.    'వారణాసి'లో మహేష్ ఐదు పాత్రలు పోషిస్తున్నాడనే వార్త నిజమైతే మాత్రం.. ఇది అభిమానులకు బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.  

Is Mahesh Babu playing five roles in Varanasi?

Publish Date:Dec 10, 2025

Superstar Mahesh Babu and legendary director SS Rajamouli are coming together for the first time with Vaaranaasi. The movie announcement video has created global sensation with stunning VFX and high-end concept. The movie team have been maintaining a tight lip about shooting updates, post the release of the video.  Now, the rumors about Mahesh Babu playing five roles are going around across the internet. It is stated that along with Lord Rama, Rudra, he is playing roles like Lord Shiva, A traveller King of Ancient India and another hidden role. They are also staring that the movie is being divided into two parts.  Rumors are also aplenty that Mahesh is taking Rs.50 crore salary per annum for the project till the movie shoot is over. He might be looking at a huge paycheck of Rs.150-175 crores as his remuneration for the film. Rajamouli is said to be planning even bigger schedule from January till March 2026, in RFC.  Well, some close sources to the team have rubbished five roles for Mahesh rumors. They stated that he might be appearing in different get-ups but only two roles as Rama and Rudra. And they did not confirm about MB's salary or two parts rumors. Priyanka Chopra and Prithviraj Sukumaran are playing other leading roles.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969

12A Railway Colony

Publish Date:Dec 31, 1969