English | Telugu

47 ఏళ్ల హీరోకి జోడిగా సాయి పల్లవి!.. ఫ్యాన్స్ ఏమంటారో మరి 


-ఎవరు ఆ హీరో
-ఫ్యాన్స్ ఏమంటారో
-సాయి పల్లవి ఛరిష్మానే వేరు

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై 'సాయిపల్లవి'(Sai Pallavi)చరిష్మాకి ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం. చాలా కాలం తర్వాత హీరోయిన్ ని చూసి సినిమాకి వెళ్లే రేంజ్ ని సంపాదించి హీరోయిన్ కట్ అవుట్ కి గుర్తింపుని తీసుకొచ్చింది. అందుకే అనతికాలంలోనే ప్రపంచ సినీ విశ్లేషకులు ఔరా అనుకునే రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లి క్యారక్టర్ ని పోషిస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్స్ లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.


లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam)'థగ్ లైఫ్' తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని 'విజయ్ సేతుపతి'(Vijay Sethupathi)తో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సదరు చిత్రం గురించి అధికార ప్రకటన రానుంది. విజయ్ సేతుపతి సరసన 'సాయి పల్లవి'ని మేకర్స్ హీరోయిన్ గా ఎంపిక చేశారనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గాని సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ న్యూస్ పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు విజయ్ సేతుపతి వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన కట్ అవుట్ అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దీంతో విజయ్ సేతుపతి సరసన సాయి పల్లవి సెట్ అవుతుందా కూతురిగా ఉంటుందనే కామెంట్స్ ని కొందరు చేస్తున్నారు.

also read:సంక్రాంతి విన్నర్ ఎవరు.. మీకు తెలుసా!

మరికొంత మంది మాత్రం ఈ విషయంపై స్పందిస్తు విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబో కొత్తగా ఉంటుందని, ఇద్దరి ఏజ్ గ్యాప్ విషయంలో తేడా ఉన్నా, సినిమా అనే అద్భుతమైన దృశ్య కావ్యం ఆ ఛాయలు కనపడకుండా చేస్తుందని అంటున్నారు.పైగా సాయి పల్లవి, మణిరత్నం కూడా తమ ప్రతిభతో మెస్మరైజ్ చెయ్యడంలో దిట్ట అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక అందమైన ప్రేమకథగా మణిరత్నం తెరకెక్కిస్తుండటం మరో స్పెషల్. విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరిజగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.