English | Telugu

అలాంటి పాత్రతో రోజా రీ ఎంట్రీ.. తెలుగు ఆడియన్స్ ఏం చేయనున్నారు?

పదేళ్ల తర్వాత రోజా రీ ఎంట్రీ
డీ గ్లామర్ రోల్ తో సర్ ప్రైజ్
తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?

సినీ రంగంలో నటిగా తనదైన ముద్ర వేసిన ఆర్కే రోజా (RK Roja).. రాజకీయాల్లోనూ రాణించారు. రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. దశాబ్దం పాటు సినిమాలకు దూరమయ్యారు. టీవీ షోలలో మాత్రం బాగానే మెరిశారు. అలా రాజకీయాలతో సినిమాలకు దూరమైన రోజా, ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా డీ గ్లామర్ రోల్ తో కావడం విశేషం.

1991లో వచ్చిన 'ప్రేమ తపస్సు' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టిన రోజా.. వరుస సినిమాలతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తనదైన ముద్ర వేశారు. అలాంటి రోజా.. రాజకీయాల్లోకి వెళ్ళి, సినిమాలకు దూరమయ్యారు. తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో వచ్చిన 'D/O వర్మ' కాగా, తమిళ్ లో ఆమె చివరి చిత్రం 2015లో వచ్చిన 'ఎన్ వళి తని వళి'. అలా పదేళ్ళుగా నటనకు దూరమైన రోజా.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.

డీడీ బాలచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'లెనిన్ పాండ్యన్' అనే తమిళ సినిమాతో రోజా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా ఆమె లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. సంతానం అనే డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు రోజా. పేద కుటుంబానికి చెందిన వయసైపోయిన పెద్దావిడలా కనిపిస్తున్నారు. బయట చీరకట్టు, గంభీరమైన మాట తీరుతో పవర్ ఫుల్ గా కనిపించే రోజాను.. ఈ పాత్రలో ఆడియన్స్ ఎలా రివీస్ చేసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే, రోజా తన రీ ఎంట్రీ కోసం తెలుగుని కాకుండా తమిళ్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది.

Also Read: 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఫస్ట్ రివ్యూ!

2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ తరపున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాజకీయాల్లో, అందునా మంత్రిగా ఉన్నప్పుడు.. మెగా, నందమూరి కుటుంబాలతో పాటు ఎందరో సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ రోజా దారుణ విమర్శలు చేశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా.. సినీ అభిమానుల్లోనూ ఆమె పట్ల వ్యతిరేకత కనిపించింది. అందుకే, తెలుగునాట నటిగా మునుపటి ఆదరణ ఉండకపోవచ్చనే ఉద్దేశంతోనే.. రోజా తన రీ ఎంట్రీ కోసం టాలీవుడ్ ని కాకుండా కోలీవుడ్ ని ఎంచుకొని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చూద్దాం మరి, రీ-ఎంట్రీ రోజాకు ఏ మేరకు కలిసొస్తుందో. ఒకవేళ ఆ సినిమా తెలుగులోకి డబ్ అయితే.. ఇక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.