English | Telugu

ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ డిమాండ్ వింటే మైండ్ బ్లాక్!

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr),'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)కాంబినేషన్ లో అగ్ర చిత్రనిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr Ats),మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్, ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ని జరుపుకుంది. ఎన్టీఆర్ పై పలు కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించారు. 'ఆర్ఆర్ఆర్', 'దేవర' తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరగడం, కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 ,సలార్ తో ప్రశాంత్ నీల్ కూడా తన సత్తా చాటడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీకి సంబంధించి 'ప్రశాంత్ నీల్' భారీ రెమ్యునరేషన్ తో పాటు చిత్ర లాభాల్లో యాభై శాతం డిమాండ్ చేసినట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. సలార్ టైంలో కూడా ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే నిర్మాతలు మందు ఆ డిమాండ్ ఉంచాడని, మైత్రి, ఎన్టీఆర్ సంస్థలు కూడా అందుకు ఒకే ఆన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ కి లాభాల్లో 25 శాతం వాటా, ఎన్టీఆర్ 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు 25 శాతం వాటా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.'

సప్త సాగరాలుదాటి మూవీ ఫేమ్ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)హీరోయిన్ గా చేస్తుండగా భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు అగ్ర నటులు సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోనున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా, 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఎన్టీఆర్ ఆగస్టు 14 న విడుదల కాబోతున్న 'వార్ 2'(War 2)కి సంబంధించిన ప్రమోషన్స్ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. 'వార్ 2 'ద్వారా ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన హక్కులని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పొందింది.