English | Telugu

ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ ఓటీటీ డీల్.. ఎందుకిలా చేశారు..?

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని, 2026 జూన్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయముంది. అలాంటిది ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. (Dragon)

'డ్రాగన్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందట. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ అయినట్లు సమాచారం. ఈమధ్య మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. అలాంటిది, 'డ్రాగన్' ఎనిమిది వారాల ఓటీటీ డీల్ చేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. హిందీ వెర్షన్ మల్టీప్లెక్స్ చైన్స్ లో రిలీజ్ కావాలంటే.. ఎనిమిది వారాల దాకా ఓటీటీలో విడుదల చేయకూడదనే కండిషన్ ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అంటే.. హిందీలో పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకే నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని.. ఈ ఎనిమిది వారాల ఓటీటీ డీల్ చేసుకున్నట్లు వినికిడి. (NTR Neel)

ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల ఓటీటీ రైట్స్ ని వరుసగా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంటోంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ గ్లోబల్ స్థాయిలో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత 'దేవర' కూడా రికార్డు వ్యూస్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, చాలా వారాలు ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన 'వార్-2' కూడా భారీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ సినిమాలకు వస్తున్న విశేష ఆదరణ నేపథ్యంలో.. 'డ్రాగన్' రైట్స్ ని కూడా భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.