English | Telugu

జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిస్థితి ఏంటి!

రిషబ్ శెట్టి(Rishab shetty)తన వన్ మాన్ షో 'కాంతార చాప్టర్ 1'(Kantara chapter 1)ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా కలెక్షన్ల సునామి ని సృష్టిస్తున్నాడు. బాహుబలి మొదటి భాగానికి వచ్చిన కలెక్షన్ లు సైతం కాంతార చాప్టర్ 1 దెబ్బకి చెల్లా చెదరయ్యాయి. దీనికంతటికి మూలకారణం 'రిషబ్ శెట్టి'(Rishab Shetty).తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త సూపర్ స్టార్ గా అవతరించాడు. ప్రేక్షకులు కూడా ముక్త కంఠంతో ఇదే మాట చెప్తున్నారు. దీంతో రిషబ్ శెట్టి తదుపరి చిత్రాలపై అభిమానులు, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.

రిషబ్ శెట్టి ప్రస్తుతం హిందువుల ఆరాధ్య దైవం, శ్రీరామదూత హనుమంతుడికి చెందిన సబ్జెక్ట్ నేపథ్యంలో 'జై హనుమాన్'(Jai Hanuman)అనే డెవోషనల్ చిత్రంతో పాటు,మరాఠా యోధుడు, హిందు ఐకాన్ గా పిలవబడే 'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji Maharaj)జీవిత కథ ఆధారంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండిటిలోను టైటిల్ రోల్ లో కనిపిస్తున్నాడు.పైగా రెండు చిత్రాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. కాంతార చాప్టర్ 1 సృష్టించబడిన చిత్రం. కానీ జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ లు నిజ జీవితంలో హిందువుల మనోఫలకాల్లో మెదిలినవి. చాప్టర్ 1 లో ఒక రేంజ్ లో పెర్ ఫార్మ్ ప్రదర్శించిన రిషబ్, ఈ రెండు చిత్రాల్లో మరెంత పెర్ ఫార్మ్ ని ప్రదర్శిస్తాడో చెప్పక్కర్లేదు.


పైగా స్వతహాగా రిషబ్ శెట్టి కి కూడా దైవ చింతన ఎక్కువ. దీంతో సదరు రెండు చిత్రాల్లో తన నటన ఏ స్థాయిలో సాగుతుందో ఎంత ఊహించిన తక్కువే అవుతుంది.మేకర్స్ కూడా చాప్టర్ 1 భారీ స్థాయిలో విజయం సాధించడంతో, సదరు రెండు చిత్రాల నిర్మాణం, సబ్జెట్, క్వాలిటీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. జై హనుమాన్ నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ 2027 లో విడుదల కానుంది.


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.