English | Telugu

విక్రమ్ కీలక నిర్ణయం.. షాక్ లో ఫ్యాన్స్ 

ప్రేక్షకులని మెప్పించడం కోసం హీరో తన క్యారక్టర్ పరంగా ఎంత కష్టమైనా పడతాడు. కానీ ఆ పరిధిని దాటి క్యారక్టర్ కోసం మరింత కష్టపడే హీరో ఎవరంటే విక్రమ్(Vikram)అని చెప్పవచ్చు. విక్రమ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలే అందుకు ఉదాహరణ. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా అన్నిఅలాంటి చిత్రాల్లోనే చేస్తు అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. నటనా పరంగా విక్రమ్ కి మంచి పేరే వస్తుంది. కానీ కమర్షియల్ గా హిట్ అవ్వకపోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా రావడం లేదు. ఇందుకు ప్రీవియస్ మూవీ 'తంగలాన్' ఒక ఉదాహరణ. దీంతో విక్రమ్ ఒక కీలక నిర్ణయం తీసున్నట్టుగా తెలుస్తుంది.

విక్రమ్ ప్రస్తుతం '63 'అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం తంగలాన్ కంటే ముందే స్టార్ట్ అవ్వగా కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది.ఇక ప్రాజెక్ట్ లేట్ అవుతుండటంతో ఈ చిత్ర దర్శకుడు మడోన్ అశ్విన్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. దీంతో మరో దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇక విక్రమ్ వరుస ప్లాప్ ల్లో ఉండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓటిటి, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బాగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని కారణంగా చూపుతు సదరు సంస్థ విక్రమ్ తో రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరింది. తన ప్రస్తుత పరిస్థితి తెలిసిన విక్రమ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లుగా తెలుస్తుంది.

ఇక విక్రమ్ హిట్ ని అందుకొని సుమారు పది సంవత్సరాలు అవుతుంది. 2022 ,2023 లో పొన్నియన్ సెల్వం పార్ట్ 1 ,పార్ట్ 2 తో ఒక మాదిరి విజయాన్ని అందుకున్నా, ఆ క్రెడిట్ మొత్తం విక్రమ్ కి రాదనే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో వీర ధీరశురన్ తో పలరించాడు. ఈ చిత్రం కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేదు.



సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.