English | Telugu

చరణ్ ని కలిసిన జపాన్ మహిళా ఫ్యాన్స్..  ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా!


-జపాన్ మహిళా ఫ్యాన్స్ ఆనందం
-చరణ్ తో ఫోటోలు
-అభిమానానికి ముగ్దుడైన చరణ్
-పెద్ది తో సత్తా చాటడానికి రెడీ

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)కి ఉన్న అభిమాన ఘనం అపారం. ఆ అభిమానాన్ని ఏ స్థాయిలో చూపిస్తారో అనే విషయం రామ్ చరణ్ బర్త్ డే రోజుతో పాటు సినిమా రిలీజ్ రోజు అర్ధమవుతుంది. చరణ్ కూడా అభిమానుల పట్ల ఎప్పుడు కృతజ్నతా భావంతో ఉంటాడు. ఇక చరణ్ రేంజ్ 'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసేలా ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

రీసెంట్ గా జపాన్(Japan)దేశం నుంచి ఐదుగురు మహిళా అభిమానులు చరణ్ ని కలవడం కోసం హైదరాబాద్(Hyderabad)లోని చరణ్ నివాసానికి వచ్చారు. ఆ అందరు చరణ్ అప్ కమింగ్ మూవీ 'పెద్ది' నుంచి ఇప్పటి వరకు చరణ్ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లోని స్టిల్స్ అన్నిటిని ఒక చోటున ఉంచి గ్రీటింగ్ లాగా చేసుకొని వచ్చారు. దీంతో వాళ్ళ అభిమానానికి చరణ్ ముగ్దుడయ్యాడు. ఆ అందరితో ఫోటోలు దిగడమే కాకుండా క్రికెట్ బ్యాట్స్ పైన తన సంతకం చేసి వాళ్ళకి అందించాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:అధ్యక్షఎన్నికల్లో జానీ మాస్టర్ విజయం..సృష్టి వర్మకి షాక్!

పెద్ది విషయానికి వస్తే అభిమానులకి ఈ సారి పెద్ది(Peddi)తో మంచి ట్రీట్ ఇవ్వాలనే పట్టుదలతో చరణ్ ఉన్నాడు. అందుకు తగ్గట్టే శరవేగంగా చిత్రీకరణలో పాల్గొంటూ నెక్స్ట్ ఇయర్ మార్చి 26 న వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనున్నాడు. ప్రస్థుతానికి 'చికిరి' సాంగ్ తో పాటు సదరు సాంగ్ లో ప్రదర్శించిన స్టెప్స్ తో గ్లోబల్ స్థాయిలో టాక్ అఫ్ ది టౌన్ గా మారి తన సత్తా చాటుతున్నాడు.



సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.