English | Telugu

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పవన్ పై జయసుధ కీలక వ్యాఖ్యలు.. ఆ పార్టీలో చేరుతుందా!

-పవన్ పై ఏం మాట్లాడింది!
-జయసుధ మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా!
-ఎవరికీ తలవంచడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. సహజనటి జయసుధ(Jayasudha).. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలుగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఎనలేని పాపులారిటీ ని పొందిన లెజండ్రీ యాక్టర్స్. ఈ ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవంగా కూడా ఉంది. 'బాలు' మూవీలో తల్లి కొడుకులుగా సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరికి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


జయసుధ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)రాజమండ్రిలో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి హాజరయ్యింది. కొంత మంది మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయాన్ని చెప్పమని జయసుధ ని అడిగారు. అప్పుడు జయసుధ మాట్లాడుతు పవన్ యాటిట్యూడ్ పవన్ దే. తనకంటు ఒక స్టైల్ ఉంది. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. బిహేవియర్ లో ఎలాంటి మార్పు లేదు. ఆయన పడిన కష్టం, సిన్సియారిటీ నే ఈ రోజు డిప్యూటీ సిఎం స్థాయిలో ఉంచింది. మొదటిసారి ఫలితాలు అనుకూలంగా రానప్పుడే మనకెందుకులే అనుకోని వెనక్కి వెళ్లి పోవచ్చు. కానీ అలా వెళ్లకుండా దైర్యంగా ఉన్నాడు. సినిమాల్లో చేస్తాను అంటే ఆయన అడిగింది, కోరుకుంది ఇవ్వడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. కానీ ప్రజల కోసం ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సినిమాల్లో ఎవరికీ తలవంచలేదు. రాజకీయాల్లో కూడా అలాగే వెళ్తున్నాడని జయసుధ చెప్పుకొచ్చింది.

Also read:చరణ్ ని కలిసిన జపాన్ మహిళా ఫ్యాన్స్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా!

ఇప్పుడు ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. జయసుధ ఏపి పాలిటిక్స్ లో యాక్టీవ్ కాబోతుందని, జనసేన నాయకులతో టచ్ లో ఉన్నారనే వార్తలు కొన్ని రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో జయసుధ జనసేన పార్టీలో చేరుతుందేమో అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

జయసుధ పొలిటికల్ జర్నీని ఒకసారి చూసుకుంటే 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సికింద్రాబాద్ ఎంఎల్ఏ గా పని చేసింది. ఆ తర్వాత టీడీపీ, వైసిపీ లో కూడా పని చేసి బయటకి వచ్చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించడం లేదు. ఇక ఇదే క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో రాజకీయాలోకి వస్తారా అనే ప్రశ్నకి జయసుధ బదులిస్తూ ప్రస్తుత రాజకీయాలు సూటవుతాయా లేదా చూడాలని చెప్పడం గమనార్హం.



సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.