English | Telugu

అప్పుడు మా అమ్మ, ఇప్పుడు ధర్మేంద్ర.. జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు 

-జాన్వీ కపూర్ అసలు ఏం చెప్తుంది.
-శ్రీదేవి మరణంపై ఎందుకు మాట్లాడింది
-మరి ధర్మేంద్ర మరణంపై కూడా ఏం చెప్తుంది
-మీడియా అత్యుత్సాహం చూపిస్తుందా!

ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో 'దేవర'తో టాలీవుడ్ ని ఏలబోయే నెంబర్ వన్ హీరోయిన్ గా అభిమానుల్లో గుర్తింపు పొందిన భామ 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor). అందుకు తగ్గట్టే ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది(Peddi)తో నెంబర్ వన్ ప్లేస్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. తల్లి శ్రీదేవి(Sridevi)లా అందంలో గాని నటనలో గాని ప్రేక్షకులని కట్టిపడెయ్యడం జాన్వీ కపూర్ కి ఉన్న ప్లస్ పాయింట్. అక్టోబర్ లో 'సన్నీ సంస్కారికి తులసి కుమారి' అనే బాలీవుడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది.

రీసెంట్ గా జాన్వీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సెలబ్రటీస్ చనిపోయినప్పుడు కొన్ని మీడియా సంస్థలు వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చింది రాస్తున్నారు. మా అమ్మ మరణించినప్పుడు ఎలా అయితే అత్యుత్సాహం చూపించిందో, రీసెంట్ గా ధర్మేంద్ర(Dharmendra)గారు చనిపోయినప్పుడు కూడా అదే అత్యుత్సాహాన్ని చూపించింది. కొందరు ఆయన మరణం విషయంలో మరింతగా దిగజారి ప్రవర్తించారు. అది నిజమైన జర్నలిజం కాదు. నేను ఇండస్ట్రీలోకి రావడానికి కొన్ని నెలల ముందే మా అమ్మ చనిపోయింది. నా తొలి సినిమా ఫంక్షన్ లో మా అమ్మ గురించి మాట్లాడిన వాటిపై మీమ్స్ చేసారు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. నేను ఏం మాట్లాడినా తప్పుగా అనుకున్నారు.

also read: అఖండ 2 టాక్ ఎలా ఉండబోతుంది!


అసలు తల్లి మరణంపై కూతురు బాధపడుతుంటే దాన్ని కూడా అపహాస్యం చేస్తారని ఎవరైనా ఊహించగలరా!. అమ్మ మరణంపై కూడా ఎన్నో అవాస్తవాలు రాసారు. ఆ సమయంలో ఎంతో గందరగోళానికి గురయ్యాను. ఎప్పటికి కోలుకోలేనని భయపడ్డాను. ఆ తర్వాత అన్ని అర్ధం చేసుకొని నా పనిపై దృష్టి పెట్టాను. 2018 లో దఢక్ అనే హిందీ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇప్పటి వరకు సుమారు పదకొండు చిత్రాల వరకు చేసింది. కానీ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.