English | Telugu

'అఖండ'కు నాలుగేళ్లు.. అబ్బాయ్ ట్వీట్ కి బాబాయ్ ఫ్యాన్స్ రియాక్షన్..! 

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్
నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అఖండ
ఎన్టీఆర్ ట్వీట్ ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు
అఖండ-2 విడుదల రోజు ఎన్టీఆర్ ఏం చేయనున్నాడు?

సింహా, లెజెండ్ తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'అఖండ'(Akhanda). కోవిడ్ పాండమిక్ టైంలో.. మళ్ళీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారా? అనే అనుమానాలను బద్దలు కొడుతూ.. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం 2021, డిసెంబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టింది అఖండ. అఘోరగా బాలయ్య తాండవానికి బాక్సాఫీస్ షేక్ అయింది. ఓ వైపు కోవిడ్ భయం, మరోవైపు తక్కువ టికెట్ ధరలు వంటి ప్రతికూలతలు నడుమ.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టింది అంటే ఎంతటి సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

'అఖండ' అనేది నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తిండిపోయే ప్రత్యేక చిత్రం. ఇక ఆ సినిమా విడుదల రోజు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం.. ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని ఇచ్చింది. "ఇప్పుడే అఖండ చూశాను. సినిమాలో హార్డ్‌కోర్ ఫ్యాన్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయ్ కి, మూవీ టీంకి నా శుభాకాంక్షలు" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. "బాల బాబాయ్ కి కంగ్రాట్స్" అంటూ అబ్బాయ్ ట్వీట్ చేయడంతో.. ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు.

Also Read: 'అఖండ-2'లో శివుడి పాత్రలో చిరంజీవి!

'అఖండ' చూసి నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా, అందరి హీరోల అభిమానులు ఫిదా అయ్యారు. రౌద్రరసం పండించడంలో బాలయ్యకు బాలయ్యే సాటి అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కోవిడ్ భయాన్ని పక్కన పెట్టి, ఈ సినిమా చూడటానికి క్యూ కట్టారు. అందుకే 'అఖండ' అంతటి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు 'అఖండ'కు సీక్వెల్ గా 'అఖండ-2' వస్తోంది. ఈ డిసెంబర్ 5న విడుదల కానున్న 'అఖండ-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికి తోడు సీక్వెల్ హైప్, పైగా డివోషనల్ టచ్ కంటెంట్ తో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతోంది. దీంతో 'అఖండ-2' రూ.500 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Akhanda 2 Thaandavam)

నందమూరి అభిమానులు 'అఖండ-2' కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ఆరోజు మళ్ళీ ఎన్టీఆర్ ఏం ట్వీట్ చేస్తాడో చూడటం కోసం కూడా అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈసారి ఎన్టీఆర్ నుండి ఎలాంటి ట్వీట్ వస్తుందో.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.