English | Telugu

ఆమె నోర్మూయించిన కింగ్

సుశాంత్ హీరోగా నటించిన "అడ్డా" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. అసలే సందిస్తే చాట భారతం చెప్పే ఉదయ భాను... సందు దొరికింది కదా అనుకొని స్టేజ్ పైన హీరో సుశాంత్ డాన్స్ చూసి.. తన మాటలతో పోగిడేసింది.

అయితే ఆ ప్రోగ్రాం కు ముఖ్య అతిదులుగా వచ్చిన నాగార్జున ఆ మాటలు గుర్తు పెట్టుకొని చివర్లో స్టేజ్ మీద ఉదయ భానుని పిలిచి.... "భాను నువ్వు మాస్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వచ్చావా? అని అడిగాడు." దాంతో ఏం చెప్పాలో తెలియక అడ్డంగా తలూపింది భాను. "ఆ ఫంక్షన్ లో నేను కూడా ఇలాగె డాన్స్ చేశాను" అని నాగార్జున చెప్పాడంతో అందరు నవ్వినట్లు పేస్ పెట్టారు.

ఇది వినడానికి ఏదో సరదాకి అన్నట్లుగా అనిపించినా కూడా... నాగార్జున తన అసూయ ఏంటో తెలిపినట్లుగా అందరు ఫీల్ అయ్యారు. తనని పొగడకుండా సుశాంత్ ను పొగడటం ఏంటి? అన్నట్లుగా అనిపించింది అక్కడున్నవారందరికి.