English | Telugu

Akhanda 2: దటీజ్ బాలయ్య.. నిజాయితీ అంటే ఇది..!

అఖండ 2 వాయిదా
మళ్ళీ బయటపడిన బాలయ్య నిజాయితీ

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nanadamuri Balakrishna) నటించిన 'అఖండ 2: తాండవం'(Akhanda 2: Thaandavam) చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి, 'అఖండ 2'ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ కి మధ్య నెలకొన్న ఆర్ధిక సమస్యల కారణంగా పోస్ట్ పోన్ అయింది. బాలకృష్ణ తలచుకుంటే తన పవర్ ని ఉపయోగించి, సినిమా వాయిదా పడకుండా ఆపగలరు. కానీ, బాలయ్య ఆ పని చేయలేరు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఆసక్తికర చర్చ.

సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ బాలకృష్ణకు ఎంతో పట్టుంది. ఒక్క ఫోన్ కాల్ తో పరిస్థితులు చక్కదిద్దగల పవర్ ఆయన సొంతం. హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు బాలయ్య. అలాగే, ఆయన బావ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి తోడు, టీడీపీ మద్దతిచ్చిన మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉంది.

బాలకృష్ణ తలచుకుంటే అవసరమైతే కేంద్ర పెద్దల నుంచి అయినా ఒత్తిడి తీసుకొచ్చి.. ఈరోస్ సంస్థని వెనక్కి తగ్గేలా చేయొచ్చు. బాలయ్య తన పవర్ ని ఉపయోగించి.. అసలు ఈ విషయాన్ని వాయిదా వరకు రాకుండా ఆపగలరు. కానీ, బాలకృష్ణ ఆ పని చేయలేదు. చేయరు కూడా.

Also Read: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న అఖండ-2..!

రాజకీయాల్లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు సహజం. కానీ, బాలయ్య కుటుంబంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అవినీతి చేయడం, అధికారాన్ని అడ్డు పెట్టుకొని సొంత పనులు చక్కబెట్టుకోవడం.. బాలకృష్ణకు తెలియదు. ఆ నిజాయితీనే ఇప్పుడు 'అఖండ 2' విషయంలోనూ ప్రదర్శిస్తున్నారు.

బాలయ్య తన పవర్ ని ఉపయోగించకుండా.. న్యాయబద్ధంగానే తన నిర్మాతలను పోరాడేలా చేస్తున్నారు. అలా అని నిర్మాతలను వదిలేయకుండా.. ఈ కష్ట సమయంలో ఒక కథానాయకుడిగా వారి పక్కన నిలబడ్డారు. బాలకృష్ణ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే.. తన ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడుతుంటే.. ఇంత నిజాయితీగా ఉండటం దాదాపు అసాధ్యం. కానీ, బాలయ్య మాత్రం తన పవర్ ని ఉపయోగించకుండా.. నిజాయితీగా న్యాయపోరాటం చేస్తున్నారు. అందుకే అభిమానులంతా దటీజ్ బాలయ్య అంటూ ప్రశంసిస్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.