English | Telugu

ప్రశాంత్‌ నీల్‌ కండిషన్‌తో ఎన్టీఆర్‌కు 20 రోజులు ఇబ్బంది తప్పదు!

- ఎన్టీఆర్‌కు నిద్ర‌లేని రాత్రులు త‌ప్ప‌వు
- య‌శ్‌, ప్ర‌భాస్‌ని మించే రేంజ్‌లో ఎన్టీఆర్‌
- ఆ యాక్ష‌న్ సీక్వెన్సే కీల‌కం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్‌ సిరీస్‌, సలార్‌ చిత్రాలతో ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మనం చూశాం. వాటిని మించే స్థాయిలో ఎన్టీఆర్‌తో చేసే సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే ప్రశాంత్‌ అభిమాన హీరో ఎన్టీఆర్‌. ఇంతకుముందు యశ్‌, ప్రభాస్‌ల హీరోయిజాన్ని ఒక రేంజ్‌లో ఎలివేట్‌ చేశారు ప్రశాంత్‌. ఇప్పుడు ఎన్టీఆర్‌ని అంతకు మించి ఎక్స్‌పోజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. అయితే రెండు నెలల నుంచి ఎలాంటి షూట్ జరగడం లేదు. దీంతో సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ ప్రచారం మొదలైంది. సినిమా ఆగిపోయిందంటూ రకరకాల పోస్టులు పెట్టారు. కానీ, విషయం అది కాదని, ఒక భారీ షెడ్యూల్‌ కోసం చేస్తున్న ప్లానింగ్‌లో భాగంగా కొంతకాలం షఉటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చారని తెలుస్తోంది.


తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఈ షెడ్యూల్‌ అంతా నైట్‌ ఎఫెక్ట్‌లోనే ఉంటుందట. అది కూడా ఎన్టీఆర్‌ పాల్గొనే భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అని తెలుస్తోంది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను రాత్రి మాత్రమే షూట్‌ చెయ్యాలని ప్రశాంత్‌ నీల్‌ పెట్టిన కండిషన్‌ కారణంగా పూర్తిగా ఈ ఎపిసోడ్‌పైనే యూనిట్‌ దృష్టి పెట్టింది. యాక్షన్‌ సీక్వెన్స్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట.


ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి కీలకం అని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌ కోసమే ఎన్టీఆర్‌ కొన్నాళ్లుగా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం కృషి చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్‌ ఫిజిక్‌ పూర్తిగా మారిపోయిందంటూ రకరకాల కామెంట్స్‌ వినిపించాయి. ఈ షెడ్యూల్‌తో సినిమాకి సంబంధించిన మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయినట్టే అంటున్నారు. దీని తర్వాత పాటల చిత్రీకరణ, ఆ తర్వాత కొన్ని బ్యాలెన్స్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్‌ చేస్తామని గతంలో ప్రకటించారు. షూటింగ్‌ జరుగుతున్న విధానాన్ని బట్టి చూస్తే అనుకున్న డేట్‌కే సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.