English | Telugu

మరో బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్! ఈ సారి ఆ సూపర్ స్టార్ తో కలిసి!


-ఈ న్యూస్ నిజమేనా!
-ఎవరు ఆ సూపర్ స్టార్
-ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా!

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. ఎలాంటి క్యారక్టర్ నైనా అవలీలీలగా పోషించే ఎన్టీఆర్ సదర్ క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం యాదుండేలా చెయ్యడంలో తిరుగులేని మిసైల్. ప్రీవియస్ స్పై యాక్షన్ మూవీ 'వార్ 2'(War 2)నే రీసెంట్ ఉదాహరణ. ఆశించినంత స్థాయిలో ఫలితం రాకపోయినా ఎన్టీఆర్ పెర్ ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఇందుకు బాలీవుడ్ మేకర్స్, క్రిటిక్స్ ,ప్రేక్షకులు అతీతులేమి కాదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరో హిందీ సినిమాలో చేయబోతున్నాడనే వార్తలు ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తున్నాయి.

వార్ 2 ని సుదీర్ఘ చరిత్ర కలిగిన 'యష్ రాజ్'(Yash Raj)సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సంస్థనే 2023లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh Khan)తో స్పై థ్రిల్లర్ జోనర్ లోనే 'పఠాన్' అనే మూవీని నిర్మించింది. షారుక్ ని వరుస పరాజయాల నుంచి గట్టెక్కించిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకి పైగా రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ని తెరకెక్కించే ఆలోచనలో యష్ రాజ్ ఉన్నట్టుగా టాక్. ఆలోచనలో ఉండటమే కాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్టుగా బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లోనే ఎన్టీఆర్ ని కూడా షారుక్ తో కలిసి చేయించాలనే పట్టుదలతో యష్ రాజ్ ఉన్నట్టుగా క్రిటిక్స్ చెప్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ని సంప్రదించారనే టాక్ కూడా జోరుగానే వినపడుతుంది.


Also read:భార్యకి క్యాన్సర్, నాలుగు సర్జరీలు.. రియల్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్న షరీబ్‌

ఇంకొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలైతే స్పై యూనివర్స్ లో భాగంగా యష్ రాజ్ ఆ తరహా చిత్రాలని ఎక్కువగా నిర్మిస్తోంది. అంతే కాకుండా వాళ్ళు తెరకెక్కించిన సినిమాలని మరో మూవీకి లింక్ చేస్తున్నారు. ఈ కోవలోనే ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్(Salman Khan)'టైగర్' గా గెస్ట్ క్యారక్టర్ లో కనపడ్డాడు. ఈ కోవలోనే ఎన్టీఆర్ కూడా వార్ 2 లో పోషించిన మేజర్ రఘు విక్రమ్ చలపతి గా పఠాన్ 2 లో గెస్ట్ గా కనిపిస్తాడనే విషయాన్నీ చెప్తున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో వెయిట్ చేస్తే గాని తెలియదు.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.