English | Telugu

ఐటమ్‌ సాంగ్‌కి 5 కోట్లు.. ఆ టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ అనేవి ప్రేక్షకులకు రిలీఫ్‌నిస్తాయి. ఒకప్పుడు ఈ తరహా పాటల కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. ఆ తర్వాతి కాలంలో వారి హవా తగ్గింది. హీరోయిన్లుగా కొనసాగుతున్న వారితోనే ఐటమ్‌ సాంగ్స్‌ కూడా చేయించే కల్చర్‌ పెరిగింది. అందులో భాగంగానే ఎంతో మంది టాప్‌ హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో ఐటమ్స్‌ చేస్తూ వస్తున్నారు. అలా ఐటమ్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే.


ఒరిజినల్‌గా కర్ణాటకలోని ఉడిపికి చెందిన పూజా ఫ్యామిలీ ముంబాయిలో స్థిరపడింది. ముంబైలోనే జన్మించిన పూజా.. ఓ తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమై, ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తర్వాత 'రంగస్థలం' చిత్రంలో 'జిగేలు రాణీ..' పాటతో ఐటమ్‌ గర్ల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటిస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తోంది.


ఈ ఏడాది రజినీకాంత్‌ హీరోగా నటించిన 'కూలీ' చిత్రంలో 'మోనికా..' అనే స్పెషల్‌ సాంగ్‌లో కుర్రకారుకు పిచ్చెక్కించే స్టెప్స్‌ వేసి మరోసారి ఐటమ్‌ గర్ల్‌గా తన సత్తా చాటింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే.. మరో స్పెషల్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.


అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ కోసం పూజాను ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్‌ కోసం ఆమెకు 5 కోట్లు ఆఫర్‌ చేశారని సమాచారం. ఇప్పటివరకు ఒక స్పెషల్‌ సాంగ్‌ కోసం ఇంతటి ఆఫర్‌ ఏ హీరోయిన్‌కీ దక్కలేదు. దీన్ని బట్టి పూజాకి ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సందర్భంలో హీరోయిన్‌గా వెనకబడినా నిలదొక్కుకొని అవకాశాలు అంది పుచ్చుకుంటోంది. ఒక్క ఐటమ్‌ సాంగ్‌కి 5 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న పూజా.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.