English | Telugu

బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం.. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?

హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. డిసెంబర్ 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలసుబ్రహ్మణ్యం బావమరిది, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరికొద్ది రోజుల్లో విగ్రహావిష్కరణ జరగనుండగా ఇప్పుడు వివాదం తలెత్తింది. (SP Balasubrahmanyam)

రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు చేయడంపై కొందరు తెలంగాణ ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకని.. తెలంగాణ ప్రముఖులు గద్దర్, అందెశ్రీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రవీంద్రభారతికి వెళ్ళిన శుభలేఖ సుధాకర్ కి, ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తున్న వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగువారి ఆస్తి అని, ఆయన విగ్రహం పెట్టడంలో తప్పేముందని అంటుండగా.. మరికొందరు మాత్రం విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నారు.

వివాదం తలెత్తిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డిసెంబర్ 15న విగ్రహావిష్కరణకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.