English | Telugu

రెండోసారి వాయిదా పడ్డ జానకి సినిమా

అదేంటో గాని ఈ ఏడాది రెండోసారి కూడా విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది జానకి ఆలియాస్ కృతి సన‌న్‌కి.  ఆమె నటించిన ఆదిపురుష్ ఈ  ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ ఎక్స్ డిలే కావడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు మేక‌ర్స్. ఇప్పుడు మరో సినిమా కూడా వాయిదా పడింది. ఆ సినిమా షెహ్‌జాదా. కార్తిక్ ఆర్య‌న్‌తో న‌టించిన సినిమా షెహ్‌జాదా. అలవైకుంఠపురంలో సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కింది. షెహ్‌జాదాను ఫిబ్రవరి 10న విడుదల చేస్తామని ముందు అనౌన్స్ చేశారు.  అయితే బాలీవుడ్ లో పఠాన్ సినిమా సునామీ సృష్టిస్తుండటంతో తమ సినిమాను వారం రోజులు పాటు వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు షెహ్‌జాదా మేకర్స్. ప‌ఠాన్  సినిమాకు ఐదు రోజుల్లో 500 కోట్లకు పైగా  కలెక్షన్లు వచ్చిన విషయం తెలిసిందే...

పఠాన్ కు జేజేలు పలుకుతున్న ప్రేక్షకులు!

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ కు సరైన సక్సెస్ పడి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. కరోనా మొదలు అయినప్పటినుండి బాలీవుడ్ సినిమాలు అంటే స్వయంగా ఉత్తరాదిన చిన్నచూపు మొదలయింది. క‌రోనా భ‌యం వ‌ల్ల ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదా? అంటే అది నిజం కాదు. ఎందుకంటే వారు సౌత్ సినిమాలకు థియేటర్‌లో పెద్ద క్యూ కడుతున్నారు. కానీ హిందీ సినిమాలను మాత్రం పట్టించుకోవడం లేదు. చాలా కాలం తర్వాత హిందీ సినిమా కోసం ఆడియ‌న్స్ క్యూ  కడుతున్నారు. అదే బాలీవుడ్ బాద్షా షారుక్ నటించిన పఠాన్ చిత్రం కోసం. దీనికి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌. ఇలా జనాలను క్యూలో నిలబెట్టిన ఘనత షారుఖ్ కంటే సిద్ధార్థ్‌ ఆనంద్ కే  ఎక్కువగా దక్కుతుంది. ఇది విశ్లేషకుల అభిప్రాయం.