Publish Date:Feb 10, 2020
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా కల్లోలంతో చైనా అల్లకల్లోలమవుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఏడెనిమిది వందల మంది మరణించగా, వేలాది మంది వైరస్ బారినపడ్డారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఒక్కటి వైరస్ కాదు... రెండు వైరస్ లు గడగడలాడిస్తున్నాయి. ఈ వైరస్ లు జనాన్ని కంటే ఎక్కువగా రాజకీయ పార్టీలను వణికిస్తున్నాయి. ఇంతకీ ఈ వైరస్ లను కనిపెట్టింది... సృష్టించింది కూడా పొలిటికల్ పార్టీలే. అంతేకాదు, ఈ వైరస్ లు కరోనా కంటే డేంజర్ అంటున్నాయి. అధికార వైసీపీ.... ఎల్లో వైరస్ ను కనిపెడితే... ప్రతిపక్ష నేత చంద్రబాబు... వైసీపీ వైరస్ ను సృష్టించారు. ఇంతకీ ఈ వైరస్ లు ఏంటో ఇఫ్పటికే మీకు అర్ధమై ఉంటుంది. అదేనండీ పొలిటికల్ వైరస్ లు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే... ఈ వైసీపీ వైరస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టిపీడిస్తోందని జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.
కరోనా... చైనాను అతలాకుతలం చేస్తుంటే.... దానిని మించిన వైసీపీ వైరస్ ఎనిమిది నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తోందని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ పేరెత్తితేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ వైరస్ దెబ్బకు కంపెనీలన్నీ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నాయని అన్నారు. ఏడెనిమిది నెలలుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని మండిపడ్డారు.
అయితే, చంద్రబాబు విమర్శలకు వైసీపీ నేతలు రివర్స్ కౌంటరిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ మరింత ప్రమాదకరమని సెటైర్లు వేస్తున్నారు. చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే... ఆంధ్రప్రదేశ్ ను ఎల్లో వైరస్ పట్టి పీడిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి కరోనా వైరస్ పడితే, ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి, ఏపీలో కొత్త వైరస్ లను సృష్టించిన టీడీపీ, వైసీపీలు... కరోనా పేరుతో కొత్త తరహాలో వైరస్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్... మీరు కారణమంటే మీరు కారణమంటూ బాబు, జగన్ ఆరోపణలు...
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysrcp-virus-dangerous-than-corona-disperses-ap-for-8-months-25-94030.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.