సమైక్య తీర్మానానికి వైకాపా మద్దతు ఇస్తుందా?

Publish Date:Jan 2, 2014

Advertisement

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభ వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకొని దానిని తన సమైక్య అనుచరుడు శైలజానాథ్ కు కట్టబెట్టారు. దానిపై ప్రస్తుతం జరుగుతున్నయుద్ధం గురించి అందరూ చూస్తూనే ఉన్నాము. శైలజానాథ్ చేత రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ శాసనసభలోఒక తీర్మానం ప్రవేశపెట్టించాలనేది ముఖ్యమంత్రి వ్యూహంగా కనబడుతోంది.

 

వైకాపా మొదటి నుండి సమైక్య తీర్మానం కోసం పట్టుబడుతూ, అదిచేసే వరకు సభను నడవనీయమని చెపుతున్నందున, ఇప్పుడు తీర్మానం ప్రవేశపెడితే దానికి మద్దతు ఈయవలసి ఉంటుంది. ఇక ఇటీవల ఏపీఎన్జీవోలు సమైక్యాంద్ర కోసం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, తెదేపాలు రాష్ట్రాన్ని విడిపోకుండా ఉంచేందుకు కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి గనుక సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దానికి బేషరతు మద్దతు ఈయవలసి ఉంటుంది. కానీ వారితో కలిసి పనిచేయడానికి ఇష్టంలేదని కుంటిసాకుతో ఆ వైకాపా సమావేశానికి హాజరవలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ పార్టీ అదే వైఖరి అవలంబించవచ్చును.

 

వైకాపా మొదటి నుండి ఈ తీర్మానం కోసమే పట్టుబడుతునందున, ఇప్పడు అది సభలో ప్రవేశపెట్టబడినట్లయితే దానికి మద్దతు ఈయకుండా తప్పించుకోవడం కూడా కష్టమే. అలాగని మద్దతు ఇస్తే దానివలన ముఖ్యమంత్రికే మరింత పేరు వస్తుంది తప్ప వైకాపాకు రాదు. సీమాంధ్రలో ఏకైక సమైక్యచాంపియన్ గా నిలబడాలనుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తనకు పోటీగా తయారవ్వాలని కోరుకోరు. అదీగాక, రాష్ట్ర విభజన జరిగితే తప్ప వైకాపాకు రాజకీయ లబ్ది కలుగదు. ఈ తెర్మానానికి మద్దతు ఇస్తే అది విభజనకు అడ్డంకులు సృష్టిస్తే, ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరుగకపోతే వైకాపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గనుక ఒకవేళ సభలో మంత్రి శైలజానాథ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినా దానికి వైకాపా ఏవో కుంటి సాకులు చెప్పి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును.

 

ఇది వైకాపాకు చాలా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ, టీ-కాంగ్రెస్, తెరాస శాసనసభ్యులు ఆ తీర్మానం సభలో ప్రవేశపెట్టకుండా సభను ఎలాగూ స్తంభింపజేస్తారు గనుక, వైకాపాకు ఇక దాని గురించి ఎటువంటి దిగులు ఉండదు. కావాలంటే తను కూడా వాళ్ళతో చేరి సమైక్యతీర్మానం ప్రవేశపెట్టమని గొడవ చేస్తూ సభను స్తంభింపజేసి వాయిదాపడేలాచేయవచ్చు.

By
en-us Political News

  
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది. 
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
 బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా బెయిల్ విషయంలో ఇంకా  క్లారిటీ రాలేదు.   ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు.
బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ఎవర్నయినా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారా? ఎవరూ నోరు ఎత్తకుండా ఆందోళనకారులందర్నీ బూటు కాళ్ళ కింద వేసి తొక్కేశారే... అప్పుడేమయ్యాయి ఈ నీతి సూత్రాలు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏమైనా అభినవ గజనీయా? గతంలో ఆయన చేసినవేవీ ఆయనకు ఇప్పుడు గుర్తుకు లేవా? లేక తన కన్వీనియెన్స్ కోసం మరిచిపోయినట్లు నటిస్తున్నారా? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయహే తెలంగాణకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించే విషయమై బీఆర్ఎస్ గగ్గోలు పెట్టేస్తోంది.
ఉత్తరాదిలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వున్నా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తొమ్మిది స్థానాలు గెల‌వ‌బోతోంది. ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడానికి వ్యూహాత్మ‌కంగా ఎత్తుగ‌డ‌లు వేసింది.
వైసీపీ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం (మే28) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీలో వున్న ప్రతి అడ్డమైన వాడికీ ఒక దిక్కుమాలిన ముహూర్తం దొరికింది. ప్రతివాడూ ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం వుంటుందని చెబుతూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరాడు.
మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరుపుతోంది.  మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ చేసిన ఆగంతకుడిని ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఎస్ జవహర్ రెడ్డి నిబంధనలకు నిలువుపాతరేసి.. అడ్డగోలుగా జగన్ తో అంటకాగిన జవహర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ఎవరకూ కూడా ఆయనకు మద్దతుగా నోరు మెదపడం లేదు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది.
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల 1న జరిగే తుదివిడత పోలింగ్ తరువాత జూన్ 4న ఫలితాలు వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ తరువాత పరిశీలకులు, రాజకీయపండితులు ఒక అంచనాకు అయితే వచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడతాయి. ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టబోయేది ఎవరు? పరాజయం పాలై ఇంటికి చేరేదెవరు అన్నది తేలడానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.