శ్రీధర్ బాబుకి జలక్ దేనికో?

Publish Date:Jan 1, 2014

Advertisement

 

ఇంతకాలం గట్టిగా సమైక్యవాదం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభకు తెలంగాణా బిల్లురాగానే చాలా వీరోచితంగా పోరాడి బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేస్తారని ఆశిస్తే, ఆయన చప్పగా చల్లారిపోవడం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నిన్నఆ పదవి నుండి తప్పించి, ఆ శాఖను తన అనుచరుడు మంత్రి ఎస్‌.శైలజానాద్‌కు అదనపు బాధ్యతగా అప్పగించారు. సరిగ్గా మరో రెండు రోజుల్లో శాసనసభ మళ్ళీ సమావేశాలు మొదలవనున్న ఈ సమయంలో తెలంగాణా బిల్లును సభలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న శ్రీధర్‌బాబును ఆ పదవి నుండి తప్పించడం ద్వారా రాజకీయాలలో మళ్ళీ ఒక్కసారిగా వేడి పుట్టించారు.

 

అధిష్టానం ఆమోదముద్ర లేనిదే రాష్ట్ర మంత్రుల నియామకాలు, వారి శాఖల మార్పులు చేయ సాహసించని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే కీలకమయిన ఈ సమయంలో ఒక తెలంగాణా మంత్రిని శాఖ నుండి తప్పించడం మరోమారు అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంగానే భావించవచ్చును. దానివల్ల సీమాంధ్ర ప్రజలో దృష్టిలో ఆయన మళ్ళీ సమైక్యహీరోగా మరికొన్ని మార్కులు సంపాదించుకోవచ్చును.

 

అంతే గాక ఈ నిర్ణయం తెలంగాణా నేతలందరికీ ఆగ్రహం తెప్పించడం సహజమే గనుక రేపు వారందరూ సభలో ఆయనపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నపుడు, ముఖ్యమంత్రి పద్మవ్యూహంలో అభిమన్యుడులాగ వారినందరినీ వీరోచితంగా ఎదుర్కొని పోరాడడం ద్వారా ఈ మధ్య కాలంలో మసకబారిన తన సమైక్య చాంపియన్ ట్రోఫీకి మళ్ళీ కొత్త మెరుపులు ఆద్దుకొనే అవకాశం కూడా ఆయనకు కలుగుతుంది. ఇవన్నీఆయన కొత్త పార్టీకి ప్రజల సానుభూతిని, మద్దతుని సంపాదించిపెడతాయి కూడా.

 

ఇక రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న శైలజానాథ్ కు శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఈసారి సభలో తెలంగాణా బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. అయితే ఓటింగు కూడా అవసరం లేని బిల్లుని వారు ఎంతగట్టిగా వ్యతిరేఖించినా దానివల్ల బిల్లుపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదు. బిల్లుపై వ్యతిరేఖతకు సిద్డంపడిన తరువాతనే కేంద్రం దానిని శాసనసభకు పంపింది గనుక కాంగ్రెస్ అధిష్టానానికి ఇదేమి ఆందోళన కలిగించే విషయం కాదనే చెప్పవచ్చును. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు బిల్లుపై చర్చకు సిద్దమయినప్పటికీ, సభలో సమైక్యతీర్మానం చేసేవరకు సభను నడవనీయమని జగన్మోహన్ రెడ్డి చెపుతునందున సభలో చర్చజరగడం అనుమానాస్పదమే. కానీ, ముఖ్యమంత్రికి సభలో చర్చ జరిపే ఉద్దేశ్యం ఉంటే, వైకాపా సభ్యులతో సహా సభలో ఆందోళన చేస్తున్నవారిని సస్పెండ్ చేయవలసి ఉంటుంది. వైకాపా, తెదేపా సీమాంధ్ర సభ్యులు కూడా బహుశః అదే కోరుకొంటునట్లయితే, వారు సభ నుండి బహిష్కరింపబడగానే, మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీలపై రంకెలు వేసి తృప్తి పడవచ్చును.

 

ఈసారి సమావేశాలలో జరిగిన పరిణామాలను బట్టి, మళ్ళీ శాసనసభ జనవరి16న చివరిసారిగా సమావేశమయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు అంతిమ పోరాటం చేసి, ముందు నుండి అనుకొన్న విధంగానే బిల్లును శాసనసభ గుమ్మం వరకు సాగనంపి, రాజీనామాలు చేసి, కొత్త జెండా పట్టుకొని ప్రజల ముందు రావచ్చును.

By
en-us Political News

  
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది.
 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. 
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.