శాసనసభకి జగన్మోహన్ రెడ్డి శలవు!

Publish Date:Dec 21, 2015

Advertisement

 

శాసనసభ సమావేశాలలో ఒకసారి ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తే మరొకసారి ప్రతిపక్ష సభ్యులే శాసనసభని బాయ్ కాట్ చేసి బయటకి వెళ్లిపోతుంటారు. ముల్లు వచ్చి అరిటాకు మీద పడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా అరిటాకుకే నష్టం అంటారు. కానీ ప్రతిపక్షాలకి ఆ సూత్రం వర్తించదనే చెప్పుకోవాలి. ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసినా, ప్రతిపక్ష సభ్యులే శాసనసభని బాయ్ కాట్ చేసి బయటకి వెళ్లిపోయినా తప్పంతా అధికార పార్టీదేనని వాదిస్తుంటాయి. మొన్న వైకాపా సభ్యులందరినీ సభ నుంచి రెండు గంటల పాటు సస్పెండ్ చేసినపుడు అది చాలా అన్యాయమని వాదించారు. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని జగన్ చాలా ఆవేదన పడిపోయారు. ఈరోజు సమావేశాలు ప్రారంభం కాగానే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా? కాల్ మనీ వ్యవహారంపై సభలో చర్చిస్తారా? లేదా అని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ని ప్రశ్నించారు. ఆయన నిరాకరించడంతో “అయితే ఇక శలవు” అంటూ జగన్ తన ఎమ్మెల్యేలతో సహా సభను బహిష్కరించి బయటకి వెళ్ళిపోయారు.

 

సభ నిర్వహణకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అందరూ దాని ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. కానీ శాసనసభలో కార్యక్రమాలు తను ఆశించినట్లు జరగాలని జగన్మోహన్ రెడ్డి కోరుకొంటున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం ఆయనకీ తెలుసు. సమావేశాలను బాయ్ కాట్ చేస్తూ అందుకు కారణం అధికార పార్టీ నిరంకుశ వైఖరేనని ఆరోపించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి సభను తమకు ఇష్టం వచ్చినట్లు నడిపించుకొంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే కాల్ మనీ వ్యవహారంలో సభలో జగన్ గంటల తరబడి ధాటిగా మాట్లాడిన విషయం మరిచిపోయినట్లున్నారు.

 

ఈరోజు శాసనసభలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్‌ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్‌ బోర్డు బిల్లు, విదేశీ మద్యం సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, మెట్రో పాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బిల్లులపై చర్చ జరుగబోతోంది. ఆ చర్చలో పాల్గొని వాటిలో లోటుపాట్లను ఎత్తి చూపించవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా మీద ఉంది. కానీ ఆ చర్చలో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయి తిరిగి ప్రభుత్వాన్నే నిందిస్తోంది.

 

ఇంతకు ముందు సమావేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే తొందరపాటు ప్రదర్శించి సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోయారు. ఆవిధంగా చేసినందుకు ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో మళ్ళీ సభకు తిరిగి వచ్చేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినం. కనుక తన జన్మదిన వేడుకలు జరుపుకొనేందుకే సభను బహిష్కరించి బయటకు వెళ్లిపోయారని అప్పుడే మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనుక మళ్ళీ రేపు సభకు తిరిగి వస్తారేమో?

 

తెదేపా ప్రభుత్వం ఈసారి శాసనసభ సమావేశాలను కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించుకొన్నప్పుడు వైకాపా దానిని తప్పు పట్టింది. అనేక ప్రజా సమస్యలపై చర్చ జరుగవలసి ఉండగా కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలనుకోవడం సరికాదని, కనీసం మరో వారం రోజులయినా పొడిగించాలని డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఈ ఐదు రోజుల సమావేశాల్లోనే ఒకరోజు సస్పెండయ్యి బయటకు వెళ్ళగా, ఈరోజు వైకాపాయే సభను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయింది. అయితే ఈ ఒక్కరోజుకే సభను బహిష్కరించి వెళ్ళిపోతున్నారా లేక రేపు శాసనసభ సమావేశాలు ముగిసేవరకు బహిష్కరించబోతున్నారో జగన్ చెప్పలేదు. కనుక వైకాపా సభ్యులు రేపు సభకు వస్తారో రారో తెలియదు. మరి ఈవిధంగా వ్యవహరిస్తున్నప్పుడు శాసనసభ సమావేశాల నిర్వహణ కోసం వైకాపా పట్టుబట్టడం దేనికో?

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.