వైకాపా అందుకే ఇంత హడావుడి చేసిందేమో?

Publish Date:Dec 19, 2015

Advertisement

 

వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడటంతో స్పీకర్ కోడెల ఆమెను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అప్పుడు రోజా కానీ జగన్మోహన్ రెడ్డి గానీ పెద్దగా నిరసనలు, అభ్యంతరాలు తెలియజేయలేదు. పైగా తనను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని, చేసిన విధానానికే ఎక్కువ బాధపడుతున్నానని రోజా స్వయంగా మీడియాతో చెప్పారు. ఇక నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటానని చెప్పారు. ఆమె చెప్పిన ఈ మాటలను బట్టి సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ అయినందుకు ఆమె ఏ మాత్రం బాధపడటంలేదని స్పష్టం అవుతోంది. ఒకవేళ తనను సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని ఆమె భావించి ఉండి ఉంటే, నిన్ననే ఆమె స్పీకర్ ని క్షమాపణలు కోరి సస్పెన్షన్ వేటు పడకుండా తప్పించుకొనేది. లేదా కనీసం ఇవ్వాళ్ళ ఆయనను కలిసి తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని కోరుతాననో లేకపోతే ఆయన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తాననో చెప్పి ఉండాలి. కానీ నిన్న ఆమె అటువంటి మాటలేవీ చెప్పకుండా ఇక నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటానని చెప్పారు. అంటే తనను సస్పెండ్ చేసినందుకు బాధపదలేదని ఆమె నిజంగానే చెప్పారని అర్ధమవుతోంది.

 

సాధారణంగా ఎమ్మెల్యేలని కొన్ని రోజులపాటు సస్పెండ్ చేసినా చాలామంది తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. కానీ రోజాని ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసినా ఆమె కించిత్ బాధపడలేదు. అదే ముక్క ఆమె చాలా దైర్యంగా చెప్పారు కూడా. మరి అటువంటప్పుడు మళ్ళీ ఆమె అసెంబ్లీకి వచ్చి హడావుడి చేయడం, పోలీసులతో ఘర్షణ పడటం, స్పృహ తప్పి పడిపోవడం, నిమ్స్ ఆసుపత్రిలో చేరడం, జగన్ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వెళ్లి ఆమెను పరామర్శించడం, ఆమె ఆరోగ్యం గురించి మీడియాకి బ్రీఫింగ్ చేయడం అంతా చాలా నాటకీయంగా ఉంది. రోజా అసెంబ్లీ బయట హడావుడి చేస్తే, జగన్మోహన్ రెడ్డి, వైకాపా సభ్యులు సభ లోపల ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, సభను వాయిదా పడేలా చేసి ఆ డ్రామాను మరింత రక్తి కట్టించారు. ఒకవేళ ఆమెకి సభకి రావాలనే ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఆమెను సభ నుంచి అంత సుదీర్ఘ కాలానికి సస్పెండ్ చేస్తునప్పుడు తక్షణమే జగన్మోహన్ రెడ్డి అందుకు అభ్యంతరం చెప్పి ఉండి ఉంటే నేడు ఆయన వాదనకు అర్ధం ఉండేది. నిన్న ఆమె సస్పెండ్ అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు అసలు ఏమీ జరగనట్లుగా సభా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ ఈరోజు ఆమె సస్పెన్షన్ ఎత్తివేయాలని సభను స్తంభింపజేయడం చాలా విడ్డూరంగా ఉంది. తనను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని రోజా నోరు జారినందుకు, మీడియాలో జబర్దస్త్ కామెంట్లు వినిపించాయి. బహుశః ఆ కారణంగానే వారు ఇంత హడావుడి చేయవలసి వచ్చిందేమో?

 

ఆమెకు సభకు తిరిగి రావాలనే ఉద్దేశ్యమే ఉండి ఉంటే, ఆమె స్పీకర్ కోడెల శివప్రసాద రావుని కలిసి, నిన్న ముఖ్యమంత్రితో తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పుకొని, తనపై సస్పెన్షన్ ఎత్తివేయవలసిందిగా కోరవచ్చును. లేదా ఆమెకు ఆ అవకాశం లేకపోతే తన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా సభలో క్షమాపణలు కోరి, సస్పెన్షన్ ఎత్తివేయించుకోవచ్చును. ఆమె తన తీరు మార్చుకొనేందుకు అంగీకరించినట్లయితే ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయడం గురించి ఆలోచిస్తామని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అంటే ఆమెపై విధించిన సస్పెన్షన్ తొలగించుకొనేందుకు ఇంకా అవకాశం ఉందని స్పష్టమవుతోంది. కానీ రోజా, జగన్మోహన్ రెడ్డి, వైకాపా సభ్యులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకోవడం లేదనే విషయం ఈరోజు వారు సభలో వ్యవహరించిన తీరుతో అర్ధమవుతోంది. ఒక ఎమ్మెల్యేని ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయడం సముచితమా కాదా? అనే చర్చను పక్కనబెట్టి ఆలోచిస్తే, స్పీకర్ కి క్షమాపణలు చెప్పి సస్పెన్షన్ ఎత్తివేయించుకొనే అవకాశం ఉన్నా దానిని వైకాపా ఎందుకు వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు? ఇష్టం లేకపోయినా మళ్ళీ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? అనే సందేహాలు కలగడం సహజం. సస్పెన్షన్ గురించి రోజా మాట్లాడిన మాటల వలన ప్రజలలో దురభిప్రాయం ఏర్పడి ఉండవచ్చును. దానిని తొలగించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే నిరంకుశ పాలన సాగిస్తోందని రుజువు చేసేందుకే వైకాపా సభ్యులు ఈవిధంగా వ్యవహరించి ఉండవచ్చును. వైకాపా ఆలోచనలకు జగన్మోహన్ రెడ్డి మాటలు అందుకు అద్దం పడుతున్నాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.