ముఖ్యమంత్రిని తప్పు పట్టడమే పార్టీ విధానంగా మార్చుకొన్న వైకాపా?

Publish Date:Dec 18, 2015

Advertisement

 

రాజకీయ పార్టీల మధ్య స్నేహాలు, శత్రుత్వాలు సర్వసాధారణమయిన విషయమే. మిత్రులుగా ఉన్నప్పుడు తప్పులు సమస్యలను పట్టించుకోకపోవడం, శత్రువులుగా ఉన్నప్పుడు విమర్శించుకోవడం కూడా సహజమే. ఒక స్థాయి వరకు మాత్రమే విమర్శలు చేసుకొంటే పరువాలేదు. కానీ తమ మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా వ్యక్తిగత దూషణలకు, బెదిరింపులకి దిగుతూ రాజకీయాలను ఇంకా నీచ స్థాయికి దిగజార్చితే అంతిమంగా దాని విషపరిణామాలను ఎదుర్కోవలసింది..నష్టపోయేది కూడా ఆ రాజకీయ పార్టీలు, వాటి నేతలే తప్ప ప్రజలు కాదు.

 

రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుండి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ఎంతగా పరితపించిపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ తనకు ఆ అవకాశం దక్కకపోవడానికి చంద్రబాబు నాయుడే కారకుడని దృడంగా విశ్వసిస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేసినప్పటికీ దానిలో తప్పులు ఎంచుతూ విమర్శించడమే తన పార్టీ విధానంగా మార్చేసుకొన్నారు.

 

అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం చంద్రబాబు నాయుడుకి గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే దానిపై కూడా వైకాపా ఎమ్మెల్యే రోజా చాలా అనుచితంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకి చికాగో విశ్వవిద్యాలయాన్ని ‘మేనేజ్’ చేసి డాక్టరేట్ సంపాదించుకొంటున్నారని రోజా ఆరోపించారు. ఆయనకు డాక్టరేట్ ఇచ్చి చికాగో విశ్వవిద్యాలయం తన స్థాయిని దిగజార్చుకొందని విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడుకి ఈ డాక్టరేట్ వచ్చినా రాకపోయినా కొత్తగా వచ్చే లాభమూ లేదు... నష్టమూ లేదని అందరికీ తెలుసు. అది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. దాని కోసం ఆయన అర్రులు చాచవలసిన అవసరం లేదని అందరికీ తెలుసు. ఒకవేళ చికాగో విశ్వవిద్యాలయంలో నిజంగా ఎవరయినా ‘మేనేజ్’ చేసి డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించుకొనే అవకాశమే ఉండి ఉంటే అదిచ్చే డాక్టరేట్లను ఎవరూ స్వీకరించి ఉండేవారే కాదు.

 

చంద్రబాబు నాయుడుని ఏదో ఒకవిధంగా అవమానించాలి. ప్రజలలో ఆయనపట్ల అపోహలు, అనుమానాలు సృష్టించాలి. అప్రదిష్ట పాలు చేయాలనే తపన వైకాపా చేస్తున్న ప్రతీ ఆరోపణలో ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది. దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రకటిస్తే, అందుకు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషించారు కానీ వైకాపా నేతలు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ని కూడా ‘మేనేజ్’ చేసి ఆ ప్రకటన ఇప్పించుకొన్నారని విమర్శించారు.

 

ప్రపంచ బ్యాంక్ చేసిన ఆ ప్రకటన వలన రాష్ట్రానికి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం జరగదని అందరికీ తెలుసు. కానీ తెదేపాను వ్యతిరేకించడమే పార్టీ విధానంగా మార్చుకొన్న వైకాపా నేతలు రాష్ట్రానికి మేలు చేకూరేవాటిని కూడా వ్యతిరేకిస్తారని అది స్పష్టం చేస్తోంది. తెదేపా ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పకుండా వేలెత్తి చూపవలసిందే. తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దాని తప్పులను వేలెత్తి చూపుతూ ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోనేలాగ వారు చేస్తుంటారు తప్ప వైకాపా నేతల్లాగ ఉచితానుచితాలు మరిచి నిత్యం వ్యక్తిగత దూషణలకి, విమర్శలకి దిగరు.

 

ఇదివరకు నిత్యం రామోజీరావుని, ఆయన రాజకీయ విధానాలని విమర్శిస్తూ, అవహేళన చేస్తూ సాక్షి మీడియాలో కధనాలు, కార్టూన్లు ప్రచురించేవారు. కానీ ఒకానొకరోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన వద్దకే వెళ్లి చేతులు జోడించి మాట్లాడవలసి వచ్చింది. దానివలన రామోజీరావు గౌరవం మరింత పెరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రజలలో మరింత పలుచబడ్డారు. ఒక స్థాయికి మించి విమర్శలకు, దూషణలకు పాల్పడితే చివరికి ఏమవుతుందో తెలుసుకోవడానికి అదే ఒక చక్కటి ఉదారణగా నిలుస్తోంది.

 

తన బద్ధ శత్రువయిన రామోజీరావు ముందు చేతులు జోడించి నిలబడవలసిన పరిస్థితి ఎందుకు కలిగింది? అని ఆలోచించి మళ్ళీ అటువంటి పరిస్థితులు చేజేతులా కల్పించుకోకుండా జాగ్రత్తపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తొమిదేళ్ళుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇంకా రాజకీయ అపరిపక్వత ప్రదర్శిస్తూ, చిన్న పిల్లాడిలా ముఖ్యమంత్రి అంతటివాడికి రకరకాల పేర్లు పెడుతూ అవహేళన చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం మన ముఖ్యమంత్రిని డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తుంటే, రాష్ట్రానికి చెందిన వైకాపా నేతలు ఆయన పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు.

 

యదా రాజ తదా ప్రజా అన్నట్లుగా తమ పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడుతుంటే, వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రోజా వంటివారు వేరేలా మాట్లాడుతారని ఎవరూ ఆశించలేరు. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు దేనికీ ‘అతి’ పనికి రాదని పెద్దలు చెపుతుంటారు. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలు రెండూ పోటాపోటీగా ఆ రాష్ట్ర రాజకీయాలను అత్యంత నీచస్థాయికి తీసుకువెళ్ళిపోయాయి. చివరికి ఆ రెండు పార్టీలే అవి ప్రదర్శించిన ఆ ‘అతి’కి మూల్యం చెల్లించడం అందరూ కళ్ళారా చూసారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైకాపా ఆ స్థాయికి రాజకీయాలు దిగజార్చాలని ప్రయత్నిస్తే చివరికి తమిళనాడు పరిస్థితులే ఇక్కడా పునరావృతం కాక తప్పదని గ్రహించాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.