కిరణ్ రాయల్ పై వైసీపీ ఆరోపణలు.. అంబటి, గోరంట్ల మాధవ్ లు గుర్తు లేరా?

Publish Date:Feb 10, 2025

Advertisement

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల నుంచి ఆయనను దూరంగా ఉండాలని జనసేన అధేశించింది. పార్టీ తరఫున కిరణ్ రాయల్ పై  విచారణకు ఆదేశించడమే కాకుండా విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. 

ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలతో  జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కిరణ్ రాయల్ కూడా ఘాటుగానే స్పందించారు.  తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.   విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ అని స్పష్టంగా పేర్కొనడంతో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడం తాత్కాలిక నిర్ణయమేనని స్పష్టం చేసినట్లైంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో జనసేన చాలా పారదర్శకంగా వ్యవహరించిందనే చెప్పాలి. శనివారం సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ కు సంబంధించి వీడియోలు వైరల్ కాగానే.. జనసేన ఆయనపై విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టింది.   

అయితే ఈ వ్యవహారంలో వైసీపీ ఓవర్ యాక్షన్ వెగటు పుట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కిరణ్ రాయల్ వ్యవహారంలో వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా ఇష్టారీతిగా రెచ్చిపోతోంది. అదే సమయంలో  ఆ పార్టీలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రమోషన్లు ఇస్తూ.. కిరణ్ రాయల్ విషయంలో మాత్రం జనసేనపై విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గతంలో వచ్చిన ఆరోపణలు, ఒక మహిళతో ఆయన అసభ్య సంభాషణ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అంబటి రాంబాబుపై ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా, ఈ ఆరోపణల తరువాతే జగన్ అంబటిని మంత్రిగా ప్రమోట్ చేశారు. అదే విధంగా  ఆ పార్టీ మాజీ ఎంపీ  గోరంట్ల మాధవ్ విషయం కూడా అంతే. ఎంపీగా ఉండి ఆయన చేసిన ఛండాలం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. దీనిపై జగన్ ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా.. ఇప్పడు అదే గోరంట్ల మాధవ్ ను వైసీపీ జాతీయ అధికార ప్రతినిథిని చేసి అందలం ఎక్కించారు. 

ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో జనసేన విచారణకు ఆదేశించింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. విచారణలో ఆయన తప్పు చేసినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటుంది. కానీ అంత వరకూ ఆగకుండా వైసీపీ చేస్తున్న గగ్గోలు సిగ్గు చేటని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.