సాయంత్రం ప్రగతి భవన్ లో భేటీ కానున్న ఏపీ, తెలంగాణ సీఎంలు

Publish Date:Sep 23, 2019

Advertisement

 

నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయటంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సాయంత్రం హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. వాస్తవానికి ఈ భేటీ మంగళవారం జరగాల్సి ఉంది కానీ, ఒక రోజు ముందే జరుగుతుంది. గోదావరి జలాలను నాగార్జున సాగర్ లోనూ,  శ్రీశైలం జలాశయం లోనూ రోజుకు రెండేసి టీఎంసీల చొప్పున నూట ఇరవై రోజుల పాటు ఎత్తిపోయటంపై ఇద్దరు సీఎంలు ఇప్పటికే అంగీకరించారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ తెలియజేశారు.

దుమ్ముగూడెం నుంచి అక్కంపల్లి వరకు నాలుగు టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు పాయలుగా విడదీసి రెండు టీఎంసీలను నాగార్జున సాగర్ లో, మరో రెండు టీఎంసీలను శ్రీశైలంలోకి పంపడంపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ పథకానికి దాదాపు 1.60 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనా అయితే, పోలవరం అంశం కూడా ముఖ్యమంత్రుల మధ్య చర్చకు వచ్చే వీలుంది. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడం, ముంపు ప్రాంతాలను తగ్గించటం వంటి ప్రతిపాదనలను తెలంగాణ తీసుకువస్తే గనుక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రతిపాదించనుంది. తొమ్మిది, పది షెడ్యూల్ లోని సంస్థల విభజనపై ఇప్పటికే సీఎంల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది.

కొందరు అధికారులు అత్యుత్సాహంతో సరైన సమాచారం లేక ఉత్తర్వులను జారీ చేయటం, సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టటం వల్ల కొంత గందరగోళం నెలకొంది. దీనిపై ఇద్దరు సీఎంలు స్పష్టత ఇవ్వనున్నారు, ప్రధానంగా ఆప్మెల్ వంటి సంస్థల విషయంలో ఏకాభిప్రాయాన్ని వెల్లడించే అవకాశముంది. తెలంగాణ, ఏపీలకు సంబంధించి అధికారాల బదలాయింపు, పథకాలు, కార్యక్రమాల అమలుకు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నారు.

రెండు ప్రభుత్వాల స్థాయిలో చర్చల వల్ల సచివాలయ, శాసనసభ భవనాల అప్పగింత జరిగింది. ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల బదలాయింపునకు ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కొత్త ఇసుక విధానం రూపకల్పనలో తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందికి ఏపీలోని పోలీస్ కళాశాలలో శిక్షణ ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణ సీఎం సిఫార్సుల మేరకు ఏడుగురు తెలంగాణవారికి టిటిడి సభ్యత్వ పదవులు దక్కాయి.

By
en-us Political News

  
వైఎస్ జగన్ హయాంలో ఏపీ ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది. గుడివాడ అమర్నాథ్ కు గుడ్డు మంత్రి అన్న బిరుదును కూడా సంపాదించుకున్నారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సర్వాధికారి.. అందులో సందేహం లేదు. ఇప్పుడే కాదు.. పార్టీలో ఆయనకు ఏ పదవీ లేనప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులకు ఆయన మాటే వేదం.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ముగుస్తుండటంతో తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా సాగుతున్నారు. తాజాగా బస్ పాస్ చార్జీలను పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఆందోళనకు దిగారు.
తిరుమలలో అగ్రిప్రమాదం సంభవించింది. అయితే అటవీ ప్రాంతంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.. ఒక్క మంత్రి వర్గ విస్తరణ విషయంలోనే కాదు.. ఆయన అసంతృప్తికి ఇంకా చాలా కారణాలున్నాయి. అయితే.. రోజు రోజుకు అధిష్టానంతో పెరుగతున్న దూరం విషయంలో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పెరుగతున్న దూరం విషయంలో ఆయన కొంత మధన పడుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ( జూన్ 9) హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను తొలుత విజయవాడకు, ఆ తర్వాత గుంటూరు రూరల్ నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అమరావతిపై, అమరావతి మహిళలపై జగన్ మీడియా అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ మీడియాలో ఓ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఖండించకుండా వత్తాసు పలికిన ఆ మీడియా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది.
ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పడిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అందులోనూ గుంటూరులో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది. 2024 ఎన్నికలకు ముందు వరకూ గుంటూరు జిల్లాలో వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది. ఆ సమయంలో మనోహర్ నాయుడు కూటమి పార్టీలను, అందులోని నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు.
సజ్జల చిక్కుల్లో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు.
జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.