భగ్గుమన్న పెట్రోల్ ధరలు... సామాన్యుడి జేబుకు చిల్లు

Publish Date:Sep 23, 2019

Advertisement

 

పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా పెట్రోల్ మంటలు పుట్టిస్తోంది. వారం రోజుల్లోనే పెట్రోల్ ధర రెండు రూపాయలు పెరిగింది.  రాబోయే వారం, పది రోజుల్లో నాలుగు నుంచి ఐదు రూపాయలు పెరుగుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ఈ ధరల పెరుగుదల డైరెక్ట్ గా సామాన్యులపై భారం మోపనుంది. సౌదీ అరేబియా లోని చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడి ప్రభావం ఇంధన ధరలపై పడింది. గత ఆరు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి, వీటిని కలిపితే లీటర్ పెట్రోల్ ధర రూపాయి యాభై తొమ్మిది పైసలు, డీజిల్ ధర రూపాయి ముప్పై ఒక్క పైసలు పెరిగింది.

ఢిల్లీ లో లీటర్ పెట్రోల్ పై ఇరవై ఏడు పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ డెబ్బై మూడు రూపాయల అరవై రెండు పైసలకు చేరుకుంది, డీజిల్ ధర పధ్ధెనిమిది పైసలు పెరిగి లీటర్ అరవై ఆరు పాయింట్ ఏడు నాలుగు రూపాయలకు చేరుకుంది. గల్ఫ్ లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లోనూ ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచం లోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన అరామ్కో అప్కైగ్ పై ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపింది, క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరా చేసే సౌదీ కొన్ని రోజుల పాటు ఎగుమతిని ఆపివేస్తున్నట్లు ప్రకటించింది.

అరామ్కో ఆయిల్ రిఫైనరీలో ఇప్పటికీ మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో చమురు ఎగుమతిని పునరుద్ధరించాలని మరో నెల రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో క్రూడ్ ధరలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర డెబ్బై ఎనిమిది రూపాయలు దాటింది, క్రూడ్ ధరలు కూడా ఇదే విధంగా పెరిగితే వచ్చే నెల రోజుల్లోనే ఎనభై ఐదు రూపాయలు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుతుండటం, దానికి పెట్రో మంటపెడితే సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది.

By
en-us Political News

  
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు కలిసి రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
జగన్ విమర్శలపై విజయసాయి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. గతంలో తనను విశ్వసనీయత లేని వ్యక్తిగా జగన్ విమర్శించినప్పుడు విజయసాయి సీరియస్ గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు విషయంలో ఇప్పటి వరకూ ఊహాగాన సభలే జరిగాయి. జగన్ అరెస్టవుతారా? చంద్రబాబు హస్తిన పర్యటన అందుకేనా అంటూ మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వేసవి దృష్ట్యా పెరుగుతున్న నీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మరి మరో సారి దాడి చేస్తున్నదా? ఇక మళ్లీ మాస్కులు లేకుండా బయటకు రాలేని, రాకూడని పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు వైద్య నిపుణులు.
గంటా రవితేజ తాజాగా భీమిలి నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తన తండ్రితో పాటు నియోజకవర్గంలోని కీలకమైన రాజకీయ నాయకుల సమక్షంలో క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి మాట్లాడుతూ నోరు జారి జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య అంటూ నినాదాలు చేశారు.
పాకిస్థాన్ సహా ప్రపంచంలో ఏ మూల నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కెసిఆర్ స్థానంలో పార్టీపై పెత్తనం కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లకు తల్లిదండ్రుల్లో తలా ఒకరు సపోర్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది.
ఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ తీరు పట్ల, పార్టీలో తనకు ప్రాముఖ్యత దక్కక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకునే నిర్ణయానికి వచ్చేశారా? అంటే ఇటీవలి పరిణామాలకు తోడు తాజాగా ఆమె పార్టీ అధినేత, తన కన్న తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన ఘాటు లేఖ చూస్తుంటే ఔనని అనక తప్పడం లేదంటున్నారు విశ్లేషకులు.
రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి అన్నిదారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది.
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు.
కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2017 లో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం, గుర్తురులో ఝాన్సీ రెడ్డి రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.