ముద్రగడ అంత్యక్రియలకు జగన్.!
Publish Date:Jul 15, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇందు కోసం ఆయన బుధవారం (జులై 15) కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన జగన్.. ముందుగా ఆయన భీమవరంలో ఆక్వా రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న మేత ధరల పెంపు, మార్కెట్లో గిట్టుబాటు ధరల కొరత వంటి అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్లో జగ్గంపేట చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కిర్లంపూడి చేరుకున్వంనారు. దివంతగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు కాపు సామాజిక వర్గ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభం మృతి పట్ల జగన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన ఆయన బుధవారం(జులై 15) అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. YS Jagan attend Mudragada Padmanabham Funeral, YS Jagan Kirlampudi Visit, YSRCP Leaders Mourn, YS Jagan Bhimavaram tour, YSRCP senior leader Mudragada, Andhra Pradesh political news
http://www.teluguone.com/news/content/ys-jagan-attend-mudragada-padmanabham-funeral-36-226083.html





