కేసీఆర్ చేసిందే జగన్ చేస్తే... వర్కవుట్ అవుతుందా?

Publish Date:Sep 26, 2016

Advertisement

చలికాలంలో రోగమొస్తే వేసుకున్న మందే ఎండాకాలంలో వచ్చిన మరో రకం రోగానికీ ఎవరైనా వేసుకుంటలారా?వైఎస్ జగన్ అలాంటి ఘనకార్యమే చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది!అసలు విషయం అర్థం కావాలంటే మనం ఒకసారి రాష్ట్ర విభజన ముందు నెలకొన్న పరిస్థితుల్లోకి వెళ్లాలి...
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో పదే పదే ఒక అస్త్రం ప్రయోగించే వారు.అదే రాజీనామా అస్త్రం.ఓ సారి తాను ఒక్కడే చేస్తే మరోసారి పార్టీ ఎమ్మేల్యేలు,ఎంపీలు అందర్నీ రాజీనామా చేయించేవాడు.ఇలా ఆయన ఎప్పటికప్పుడు తన రెసిగ్నేషన్ స్ట్రాటజీతో జనంలో వుండే వారు. ఉద్యమం సెగ తగ్గకుండా చూసుకునే వారు!
వైఎస్ జగన్ కేసీఆర్ అప్పట్లో వాడిన అస్త్రం ఇప్పుడు ప్రయోగిద్దామనుకుంటున్నాడు!ఇదే అసలు సమస్య.అప్పుడు రాజీనామాల ప్లాన్ వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు అవుతుంది అనుకోవటం అవివేకం.అందుకు కారణం మారిపోయిన పరిస్థితులు,మారిపోయిన డిమాండ్లే!
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఎమోషనల్ అంశం ఆసరా చేసుకుని ఓట్ల కోసం వెళ్లారు.అయినా కూడా కొన్ని సార్లు బొక్కబోర్లా పడ్డాల్సి వచ్చింది.కాని,ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంత ఎమోషనల్ టాపిక్ ప్రత్యేక హోదా కాదు.జనానికి హోదా రావాలని వున్నా ప్రత్యేక ప్యాకేజీతో ఆల్రెడీ కేంద్రం కొంత సాటిస్ ఫై చేసేసింది.మరో వైపు ప్రత్యేక హోదా ఇక మీదట సాధ్యం కాదని క్లియర్ గా చెప్పేసింది.కేవలం ఆంధ్రాకే కాదు దేశంలో ఎవ్వరికీ ఇవ్వబోమని ఢిల్లీ పాలకులు చెప్పేశారు.మరి ఇటువంటి సమయంలో వైఎస్ జగన్ రాజీనామా అస్త్రం ఎంత వరకూ పని చేస్తుంది? కేసీఆర్ ఆంధ్రా వాళ్లని టార్గెట్ చేసినట్టు జగన్ ఎవ్వర్ని టార్గెట్ చేసి ఓటర్లని ఆకర్షిస్తాడు? కేంద్రాన్ని బలంగా విమర్శించే ఛాన్స్ లేదు.అంత దైర్యం అనేక కేసుల్లో ఇరుక్కున్న జగన్ కు వుంటే ఈపాటికే ఎన్నో సార్లు విమర్శలు చేసి వుండేవాడు!కాని, ఇంతవరకూ మోదీని,కేంద్రాన్ని పల్లెత్తు మాట ఆయన అనట్టు ఎక్కడా కనిపించలేదు. ఇక మిగిలింది చంద్రబాబుని, టీడీపిని తిట్టిపోయటం! దీని వల్ల ప్రత్యేక హోదా రాదని తెలుసుకోలేనంత పిచ్చి వాళ్లా జనం? టీడీపి ఒత్తిడి వల్ల రావాల్సిన ప్యాకేజ్ వచ్చింది. ఇంకా తెగేదాకా లాగితే అసలుకే మోసమని మెజార్జీ జనం భావిస్తున్నారు. మరి ఇటువంటప్పుడు జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయించి ఏం సాధిస్తాడు? ఎవరి మీద పోరాడతాడు?
జగన్ తన ప్రత్యేక హోదా పోరాటంలో అంతిమ దశలో ఎంపీల చేత రాజీనామా అంటూ ప్రకటించాడు.నిజంగా ఎంపీల చేత ఆయన రీసైన్ చేయిస్తారో లేదో మనకు తెలియదుగాని దాని వల్ల ప్రజలకు మాత్రం తీరని నష్టమే.త్వరలో మున్సిపల్ ఎన్నికలు వున్నాయి. అవ్వి అయ్యే వరకూ ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా ఆగిపోతాయి. ఇలా లబ్ది పొందకుండా వున్న జనం జగన్ రాజీడ్రామాలతో మరికొంత కాలం సంక్షేమ పథకాలకి ముఖం వాచిపోవాల్సి వస్తుంది. పైగా జగన్ ఎంపీల రాజీనామా స్టేట్మెంట్లో హోదాపై ప్రేమ కన్నా పొలిటికల్ కాలిక్యులేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆయనకు వున్న ఎంపీలంతా రాయలసీమ జిల్లాల్లోనూ, ప్రకాషం, నెల్లూరు జిల్లాల్లోనూ వున్నారు. వాళ్ల చేత రాజీనామా చేయించినా తిరిగి గెలుచుకునే అవకాశాలు ఎక్కువ. అక్కడ చంద్రబాబు ప్రభావంగాని, టీడీపీ బలంగాని పెద్దగా టెన్షన్ పెట్టే సూచనలు కనిపించటం లేదు. ఈ భరోసాతోనే జగన్ రాజీనామా అస్త్రం అంటున్నాడని మనం అంచనాకి రావొచ్చు.పైగా ఉప ఎన్నికల్లో గెలవటం ద్వారా ప్రజలు టీడీపీ పాలనని వ్యతిరేకిస్తున్నారని ఋజువు చేయవచ్చు.ఇదీ జగన్ వ్యూహం... 
ఇక ఫైనల్ గా జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తే ఆయనకున్న మరో లాభం ఓదార్ప యాత్ర న్యూ సీజన్! అవును... తండ్రి పోయాడన్న కారణంతో జగన్ నెలల తరబడి రోడ్లపై వున్నాడు. ఓదార్చి ఓదార్చి జనం తనని మరవకుండా జాగ్రత్తపడ్డాడు. కాని, ఇప్పుడు మరోసారి వీదుల్లోకి వెళ్లాలంటే అలాంటి కారణం ఏం దొరకటం లేదు. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం రాజీనామానే! ఎంపీల రాజీనామా అంటే బోలెడన్ని ఊళ్లూ, పట్టణాలు చాలా రోజుల వరకూ చుట్టి రావచ్చు. మీడియాలోనూ తప్పనిసరి పబ్లిసిటీ. ఇంతకంటే ప్రతిపక్ష నేతకి కావాల్సింది ఏముంటుంది? 
ఇప్పటికైతే జగన్ కన్ ఫర్మ్ గా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పలేదుగాని అదే జరిగితే జగన్ కు వచ్చే లాభం ఎక్కువ. జనానికి వచ్చే లాభం శూన్యం. ఎందుకంటే, హోదా ఇవ్వటం అనేది వైసీపీ ఎంపీలు కాదు మొత్తం ఆంద్రా ఎంపీలు అంతా రాజీనామా చేసినా ... 14వ ఆర్దిక సంఘం చెప్పేసింది కాబట్టి... కుదరని పని! అంతకు మించి ఉప ఎన్నికలు జరిగే దాకా నెలల తరబడి ఎలక్షన్ కోడ్ అమలు కావటంతో సామాన్య జనం సంక్షేమ పథకాలకి దూరం అవుతారు. ఇదీ జగన్ రాజడ్రామాతో కలిగే ప్రయోజనం! 

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.