ఆ మూడు చోట్లా వైసీపీ గెలుపు ఆశలు గల్లంతేనా?

Publish Date:Mar 21, 2024

Advertisement

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వచ్చే ఎన్నికలలో జిల్లాలో వైసీపీకి ఘోర పరాజయం తథ్యమని ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా జగన్ పార్టీ ఓటమి దిశగానే నడుస్తోందని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీకీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో పార్టీ గుర్తు ఫ్యాన్ కే గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 

ప్ర‌జ‌ల్లో  పార్టీ పట్ల వ్యతిరేకతను గుర్తించిన జగన్  దానిని సాధ్యమైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో  చేసిన సిట్టింగుల మార్పు ప్రయోగం మరింత చేటు చేసిందని జిల్లా పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఇప్పుడు జిల్లాలో ముగ్గురు సిట్టింగులు అయితే జగన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ముగ్గురికీ కూడా తామ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం నుంచి జగన్ టికెట్ ఇవ్వకపోవడమే కాదు,  అసలు పోటీ చేసేందుకు ఏ నియోజకవర్గం నుంచీ టికెట్ ఇవ్వలేదు.  

వారు మేడిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహీధర్ రెడ్డిలు. ముగ్గురూ కూడా తమ పట్ల జగన్ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంతో  ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా చివరి క్షణం వరకూ తమకు తమతమ నియోజకవర్గాల నుంచే పోటీ చేసేందుకు జగన్ టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే పార్టీ ప్రకటించిన జాబితాతో  తమకు  అసలు పోటీ చేసే అవకాశమే లేకుండా పోవడంతో రగిలిపోతున్నారు.  

వీరిలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అయితే  పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఒక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి.  అయితే అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఇప్పుడాయన మొత్తంగా ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసేది లేదని సన్నిహితులకు, సహచరులకూ చెప్పడమే కాకుండా వారినీ పార్టీకి దూరంగా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు.  

అదే విధంగా  ఎమ్మెల్యే మేడిశెట్టి వేణుగోపాల్ తన సీటు మారిస్తే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారనీ, అయితే జగన్ అందుకు కూడా నిరాకరించి పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన పార్టీకి, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. తన నియోజకవర్గం బాచేపల్లిలో పార్టీ ప్రచారంలో పాల్గొనేది లేదని తెగేసి చెప్పేశారని అంటున్నారు. అంతే కాకుండా తన అనుచరులు, తన వర్గీయులెవరూ పార్టీ ప్రచారంలో పాల్గొనద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, లేదా జనసేన గూటికి చేరదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మేడిశెట్టి వేణుగోపాల్ మొత్తంగా ఈ సారి ఎన్నికలలో  సైలెంటైపోవడానికి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఇక టికెట్ దక్కని మరో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును బుజ్జగించేందుకు మాత్రం వైసీపీ అధినేత ఒకింత ప్రయత్నం చేశారు. ఆయనను ఒంగొలు లోక్ సభ నియోజకవర్గ డిప్యూటీ కోఆర్డినేటర్  పదవి ఇస్తామని ప్రతిపాదించారు. సంతనూతల పాడు నియోజకవర్గంలో గట్టి పట్టున్న సుధాకర్ బాబు సేవలను ఆ విధంగా ఉపయోగించుకోవాలని జగన్ ప్రయత్నించినప్పటికీ సుధాకర్ బాబు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, ఆయన నేడో రేపో పార్టీ వీడే అవకాశాలున్నాయనీ అంటున్నారు. జిల్లా వైసీపీకి చెందిన మరికొందరు కీలక నాయకులతో కలిసి ఆయన తెలుగుదేశం, లేదా జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ ఆయన సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించకపోవడమే కాకుండా, తన వర్గీయులెవరూ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. సుధాకరబాబు అసంతృప్తి కచ్చితంగా సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున విజయావకాశాలను గణనీయంగా దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తంగా ప్రకాశంలో వైసీపీ ప్రకాశం కోల్పోయిందని అంటున్నారు. 

By
en-us Political News

  
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.