క్రెడిట్ వార్ లో తప్పుటడుగులు.. లోపభూయిష్టంగా వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్.!

Publish Date:Sep 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక వారంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ,  పోలవరం ఎడమ కాలువను ప్రారంభించి, రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మరోవైపు, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.

ఇక పోలవరం ఎడమ కాలువ పనులను చేపట్టింది.. సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగనే అంటూ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ శతధా ప్రయత్నిస్తోంది.  అయితే వైసీపీ ఎకో సిస్టమ్ లో ఒక మాటకు కట్టుబడి ఉండటం అన్నది కనిపించదు. ఈ క్రెడిట్ వార్ లోనూ అదే జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ అమరావతి విషయంలో, మూడు రాజధానుల విషయంలో, అలాగే మావిగన్ అంటూ పూటకో మాట, రోజుకో ప్రతిపాదనా అన్నట్లుగా వ్యవహరించిన తీరుగానే.. వైసీపీ సోషల్ మీడియా కూడా క్రెడిట్ వార్ లో రోజుకో మాట మారుస్తోంది. పోలవరం ఎడమ కాలువ జగన్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తూ పోస్టులు వెల్లువెత్తించిన మరుసటి రోజే మాట మార్చి.. పోలవరం ఎడమ కాలువ పనుల్లో లోపాలున్నాయనీ, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతోందంటూ కొత్త ప్రచారాన్ని తలకెత్తుకుంది. 

ఒకవేళ నిజంగానే పనుల్లో లోపాలు ఉంటే, ఆ లోపాలు జగన్ హయాంలోనే జరిగినవి అని వైసీపీ చెప్పుకుంటున్నట్లే లెక్క.. ఎందుకంటే పోలవరం ఎడమ కాలువ తమ అధినేత క్రెడిటే అని వాదిస్తోంది కనుక.  ప్రాజెక్టు తమదే అని చెప్పుకుంటూనే, అందులో లోపాలు ఉంటే మాత్రం అవి చంద్రబాబు, తెలుగుదేశంల నిర్వాకమేనని సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారం ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


[YCP Social Media  Flawed, YS Jagan, YSR Congress social media strategy, Polavaram Left Canal, Chandrababu Naidu, AP irrigation projects, Telugu One]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.