జనసేనలో వైసీపీ స్లీపర్ సెల్స్!

Publish Date:Oct 19, 2023

Advertisement

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఊహకు కూడా అందని విధంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ వైనాట్ 175 అన్న అధికార పార్టీలో ఇప్పుడు బ్రతుకు జీవుడా అనే భావన కనిపిస్తుంది. నారా లోకేష్ పాదయాత్ర, తెలుగుదేశం అధినేత చంద్రబాబు యాత్రలతో తెలుగుదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడే జోష్ కనిపిస్తుండగా.. అకస్మాత్తుగా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓ రెండు మూడు  రోజులు  మహా అయితే వారంలో చంద్రబాబు బయటకి వస్తారనుకోగా నెల గడిచినా వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు జైలు పాలైతే తెలుగుదేశంను   దెబ్బతీయొచ్చని వైసీపీ భావించగా.. తెలుగుదేశం ఇప్పుడు అంతకు మించిన బలంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు ఒకే చెప్పి సమరశంఖం పూరించడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజలలో తెలుగుదేశంకు బలం పెరగడంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. 

నిజానికి తెలుగుదేశం, జనసేన పొత్తును వైసీపీ తొలి నుండి జీర్ణించుకోలేకపోతోంది. రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందన్నది వైసీపీ భావన. అందుకోసమే ఈ పొత్తును చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. చేస్తోంది. తెలుగుదేశంకు బీ టీమ్ జనసేన, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దమ్ముంటే పవన్ ఒంటరిగా  పోటీ చేయాలంటూ రెచ్చగొట్టే పని చేశారు. కానీ, పవన్ నా పార్టీ నా ఇష్టం మీరెవరు చెప్పేందుకు అంటూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. మాటలతో పని కాకపోవడంతో వైసీపీ కుట్ర పూరితంగా ఈ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు పన్నాగం పన్నినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జనసేన టార్గెట్ గా వైసీపీ తెర వెనక రాజకీయం నడిపిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఓ కుట్ర పన్ని జనసేన పార్టీకి భారీ నష్టం చేకూరేలా అమలు పరుస్తున్నట్లు చెప్తున్నారు.

సాధారణంగా టెర్రరిజంలో స్లీపర్ సెల్స్ అని ఒక విభాగం ఉంటుంది. వీళ్ళు సామాన్య ప్రజలలో కలిసిపోయి తీవ్రవాదుల కోసం పనిచేస్తుంటారు. అవసరమైన సమయంలో వీళ్ళు ఆత్మహుతి దాడులకు సిద్దపడి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటారు. తీవ్రవాదులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే వీరికి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి కావాల్సినట్లుగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏపీలో సైతం వైసీపీ జనసేనపై ఇదే తరహా కుట్రకు తెరతీసినట్లుగా తెలుస్తుంది. గత రెండు మూడేళ్లుగా కొందరు వైసీపీ సానుభూతి పరులైన నేతలను ముందుగా జనసేనలోకి పంపించి.. అవసరమైనప్పుడు వారిని జనసేనలో రెబల్స్ గా తెరపైకి తెస్తారు. ముందుముందు వాళ్ళతో రాజీనామాలు చేయించి మిగతా నాయకులలో అభద్రతా భావం కలిగిచడం, తద్వారా రాజకీయ శూన్యత సృష్టించి తెలుగుదేశంతో పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అలా చేయడం ద్వారా  రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ  చూస్తున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈ వ్యూహం రూపొందిందని  అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తుపై పవన్ ప్రకటన అనంతరం జనసేనలో వైసీపీ భావాలు కలిగిన నేతలు విభిన్నంగా స్పందించారు. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ.. ఒకరిద్దరు నాయకులు పార్టీకి రాజీనామా చేసి మీడియాకి ఎక్కి పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర విమర్శలకు దిగారు. మరి కొందరు వారిని సమర్ధిస్తూ పార్టీలోనే కొనసాగుతూ విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై దృష్టిసారించిన జనసేన నాయకత్వం.. పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు. అయితే, ముందు ముందు సీట్ల సర్దుబాటు సమయంలో వీళ్ళు మరోసారి రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కనుక, వీళ్ళని ముందుగానే గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే జనసేనకు, తద్వారా జనసేన, తెలుగుదేశం కూటమికి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

By
en-us Political News

  
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.