వైసీపీ సెంటిమెంట్ డ్రామాలు బెడిసికొడుతున్నాయ్!

Publish Date:Feb 15, 2025

Advertisement

వైసీపీ ఆవిర్భావమే సెంటెమెంటును అడ్డం పెట్టుకుని జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ లో ఫలించకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని తండ్రిని కోల్పోయిన కొడుకును అంటూ జనంలోకి వచ్చారు. నభూతో న భవిష్యత్ అన్న చందంగా తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకంటే సుదీర్ఘ ఓదార్పు యాత్ర చేశారు. ఆ తరువాత అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు  మీ వైఎస్సార్ బిడ్డను అరెస్టు చేశారంటూ రోడ్లపైకి వచ్చి అప్పట్లో సెంటిమెంట్ పండించారు. ఇన్ని చేసినా 2014 ఎన్నికలలో జగన్ పార్టీ అధికారంలోకి రాలేదు.

దీంతో ఆ  తరువాత 2019 ఎన్నికలలో విజయం కోసం జగన్ ఎన్నో సానుభూతి డ్రామాలు ఆడారు. కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలి పోటు వంటి సంఘటనలతో సానుభూతి వెల్లువెత్తింది. జగన్ పార్టీకి విజయం దక్కింది. అయితే అధికారంలోకి వచ్చిన ఐదేళ్లూ  పాలన అంటే బటన్లు నొక్కడమే అన్నట్లుగా పాలించారు జగన్. అభివృద్ధిని విస్మరించి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు  అడ్డాగా మార్చేశారు. 2024 ఎన్నికల ముందు కూడా సెంటిమెంట్ పండించడానికి జగన్ చేసిన ప్రయత్నాలను జనం నమ్మలేదు. గులకరాయి దాడి అంటూ కంటి వద్ద పెద్ద బ్యాండేజీ కట్టుకుని ప్రచారం చేసినా జనం నవ్వుకున్నారే తప్ప అయ్యో పాపం అనలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరవాత.. చట్టం, న్యాయం అంటూ మాట్లాడుతుంటే జనం పట్టించుకోవడం లేదు.  

తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు ద్వారా సానుభూతి పండిద్దామని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదు. పైపెచ్చు సొంత పార్టీలోనే వంశీ అరెస్టు పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లకు వంశీకి తగిన శాస్తి జరిగింది అన్నట్లుగా కొందరు వైసీపీ నేతలే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.   

గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో వంశీ అరెస్టై 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కెడుతున్నారు. ఈ తరుణంలో వైసీపీయులు అరెస్టు అన్యాయం, అక్రమం, చట్టానికి తూట్లు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను చూసి జనం నవ్వి  పోతున్నారు. అధికారంలో ఉండగా గుర్తుకురాని ఈ పదాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయా అని ఎగతాళి చేస్తున్నారు. అదలా ఉంచితే...

వంశీ సతీమణి పంకజశ్రీ తన భర్త అరెస్టును ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు.  అంతకు ముందు హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తుండగా, ఆమె తన సొంత వాహనంలో పోలీసుల కాన్వాయ్ ను అనుసరించారు. అయితే  పోలీసులు మార్గ మధ్యంలో ఆమెను నిలువరించి అదుపులోనికి తీసుకున్నారు. ఆ తరువాత వదిలేశారు. అనంతరం ఆమె  కృష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అదే పోలీసు స్టేషన్ లో పోలీసులు వంశీని విచారిస్తున్న సమయంలో ఆమె పోలీసు స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారనీ, అరెస్టుకు కారణం కూడా చెప్పలేదనీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సెంటిమెంట్ ను పండించేందుకు శతధా ప్రయత్నించారు. 

అధికారం కోల్పోయిన తరువాత గత ఎనిమిది నెలలుగా వైసీపీ సెంటిమెంటును పండించేందుకు ఈ వ్యూహాన్నే అనుసరిస్తోంది. సోషల్ మీడియాలో బూతు, రోత పోస్టులతో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్ లను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో కూడా వారి భార్యలు మీడియా ముందుకు వచ్చి అక్రమ అరెస్టులంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ రెండు సందర్భాలలోనూ, ఇప్పుడు వంశీ అరెస్టు సందర్భంగానూ కూడా వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపలేదు.  

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.