Publish Date:Jan 23, 2024
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో క్రియాశీలం అవుతుంటే.. వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. దివంగత వైఎస్ తనయగా ఆమె తండ్రి వారసత్వం తన నుంచి లాగేసుకుంటోందన్న భయం జగన్ ను వెంటాడుతోంది. ఆమె మాటల తూటాలు తన కోటను బద్దలు కొట్టేస్తాయన్న వణుకు నిలవనీయడం లేదు. వైసీపీ అధికారానికి ఏపీలో షర్మిల ఎంట్రీ చరమగీతం పాడేయడం ఖాయమన్న నిర్ణయానికి జగన్ అండ్ కో వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఆమెను నిలువరించాలంటే ఆమెపై, ఆమె వ్యక్తిత్వంపై బురద జల్లడంతో పాటు ఆమెను వైఎస్ కుటుంబీకురాలు కాదని ప్రజలలో ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.
అందుకే వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలో వైఎస్ షర్మిలపై దుష్ఫ్రచారం, దూషణలు మొదలెట్టేసింది. అంతే కాదు.. ఆమె నుంచి వైఎస్ ను దూరం చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందుకే ఎక్కడా వైఎస్ షర్మిల పేరు ముందు వైఎస్ అన్న అక్షరాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. అంతే కాదు.. జగన్ అనుకూల మీడియా కూడా ఉద్దేశపూర్వకంగా వైఎస్ షర్మిల వార్తల కవరేజ్ లో ఆమె పేరు ముందు వైఎస్ అక్షరాలను మాయం చేస్తున్నది. ఇక ఆమె మొదటి వివాహం, రెండో వివాహం అంటూ వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకుంటూ ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఎస్టాబ్లిష్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం నానా తంటాలు పడుతోంది.
ఒక వైపు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల.. ఆయన కూడా వైఎస్ షర్మిల అనడం లేదు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయంటూ కన్నీరు పెట్టుకున్నంత పని చేసి, మెత్తగానే అయినా ఆమె చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఓ రకంగా విష ప్రచారానికి తెర లేపారు. వైఎస్ ను, వైఎస్ కుటుంబాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శించి, దూషించిన వారి పంచన చేరారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారు. ఇక సజ్జల పుత్రరత్నం, వైసీపీ మీడియా వింగ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డి అయితే.. మర్యాద ముసుగు తీసేసి.. ఆయన హయాంలో వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఆరితేరిన బూతు పురాణంతో రెచ్చిపోతున్నారు. మొత్తంగా ఎంతగా ప్రయత్నించినా వైఎస్ షర్మిల పేరు నుంచి వైఎస్ పదాలను తీసేయడం సాధ్యమయ్యే పని కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గతంలో షర్మిల జగన్ కోసం చేసిన ప్రచారం సందర్భంగా ఆమె వైఎస్ షర్మిలగానే ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్ రాజన్న బిడ్డగానే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని రంగాలలోనే విఫలం కావడం ద్వారా వైఎస్ రాజకీయ వారసత్వ గుర్తింపును జగన్ స్వయంగా పోగొట్టుకున్నారనీ, అందుకే వైఎస్ షర్మిలను వైఎస్ వారసురాలిగా రాజకీయవర్గాలు గుర్తిస్తున్నాయనీ అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-removed-ys-from-sharmila-25-169214.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.