మహానాడుపై వైసీపీ విషం.. మాస్కులు ధరించి నాటకం!

Publish Date:May 24, 2025

Advertisement

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. తెలుగుదేశం చరిత్రలోనే తొలి సారిగా కడపలో మహానాడు జరుగుతోంది. ఈ ఏడాది మహానాడు నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. జగన్ అడ్డాలో ఈ నెల 27 నుంచి 29   నిర్వ‌హించే మ‌హానాడుకు ఇక రెండు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది.  వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి.  అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది.  

మహానాడు నిర్వహణకు అనుమతి రద్దు చేయండి అంటూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నాయకత్వంలో ప‌లువురు నాయ‌కులు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చేందుకు వారంతా మాస్కుల ధరించి వచ్చారు.  
ఇంతకీ మహానాడును ఆపేయాలంటూ వారు వినతి పత్రం ఎందుకు ఇచ్చారంటే.. కరోనా మహమ్మారి. కరొనా విజృంభిస్తున్న ఈ సమయంలో మహానాడు నిర్వహణ వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనీ, రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుందనీ వారా వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మహానాడుకు వచ్చే వాహనాలనూ అనుమించవద్దనీ, వాహనాలకు ఇప్పటికే లైసెన్సులు ఇచ్చి ఉంటే వాటినీ రద్దు చేయాలనీ వారా వినతిపత్రంలో కోరారు. 

ఇదంతా ప్రజల ఆరోగ్యం పట్ల తమకున్న అక్కర, ఆందోళనగా వారు చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటికే కడప .జిల్లాలో ఉనికి మాత్రంగా మిగిలిన వైసీపీ పలుకుబడి మహానాడు తర్వాత ఆ మాత్రంగా కూడా ఉండదన్న ఆందోళనే కారణమని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి కరోనా కేసులు అక్కడక్కడా ఒకటీ అరా వెలుగు చేసినప్పటికీ.. కేంద్రం ఇప్పటికే ఇప్పుడు కరోనా ప్రమాదకరమైన వైరస్ కాదని స్పష్టంగా ప్రకటించింది. ఎలాంటి అలర్ట్ ప్రకటించలేదు. ఆందోళన అవసరం లేదని ప్రజలకు భరోసా కూడా ఇచ్చింది.  

అయినా   వైసీపీ నాయ‌కులు  మ‌హానాడు నిర్వహణపై కరోనా బూచిని చూపుతూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.  కడపలో మహానాడు నిర్వహణతో తెలుగుదేశం పుంజుకుంటుందనీ, తమ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నభయంతోనే ఇప్పుడీ యాగీ చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా సానుభూతి కానరావడం లేదు! వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు, జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నీళ్లు చల్లేశారు.
తిరుమల జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్సీ మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చివరాఖరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.