ప్రజా సేవ చేయాలనుకునే వారికి వైసీపీ వేదిక కాదు.. కుండబద్దలు కొట్టిన అంబటి రాయుడు

Publish Date:Apr 29, 2024

Advertisement

వైసీపీకి భవిష్యత్ లేదా?  ఈ విషయం పార్టీలో దగాకు గురైన వారే కాదు.. నిన్న మొన్న వచ్చి చేరిన వారికి కూడా అర్ధమైపోతోందా?  అంటే ఎలాంటి సందేహం లేకుండా ఔనని చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉంటాయి. వాటిలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో ఇలా చేరి అలా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన  ఉదంతం ఒకటి.   వైసీపీ కండువా కప్పుకుని జగన్ పై ప్రశంలస వర్షం కురిపించిన అంబటి రాయుడు రోజుల వ్యవధిలోనే  ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.  అలా వస్తూ రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో క్లుప్తంగా ఓ పోస్టు పెట్టి ఊరుకున్నారు.  వైసీపీలో చేరిన పది రోజుల్లోనే అంబటి రాయుడు రాజకీయవిరామం అంటూ రాజీనామే చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  అలా రాజకీయ విరామం అన్న అంబటి రాయుడు ఆ వెంటనే జనసేన గూటికి చేరిపోయారు. దీనిని బట్టి ఆయన రాజకీయ విరామం అన్నది ఒట్టి సాకు మాత్రమేననీ, వైసీపీకి గుడ్ బై చెప్పేశారనీ అప్పట్లోనే అందరికీ అర్ధమైంది. 

అయితే వైసీపీ తీర్ధం పుచ్చుకున్న పది రోజులకే అంబటిరాయుడికి ఆ పార్టీపై ఎందుకంత విరక్తి కలిగింది అన్నది మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియలేదు. అప్పట్లో  వారు గుంటూరు లోక్ సభ టికెట్ విషయంలో జగన్ మాట తప్పడవం వల్లే వైసీపీకి గుడ్ బై చెప్పేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన జనసేనలో చేరినా ఆ పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో గుంటూరు టికెట్ విషయంలో వైసీపీ మోసం చేయడం ఒక్కటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి కారణం కాదని పరిశీలకులు విశ్లేషించారు. అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి కారణమేమిటన్నది ఇప్పటి వరకూ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ ఏం లేదు. ఎందుకంటే తాను బయటకు రావడానికి కారణమేమిటన్నది స్వయంగా అంబటి రాయుడే వెల్లడిం చారు.  

ప్రజా సేవ చేయాలనుకుని రాజకీయాలలోకి వచ్చే వారికి వైసీపీ సరైన వేదిక కాదని గ్రహించడం వల్లనే తాను ఆ పార్టీకి గుడ్ బై చెప్పానని కుండబద్దలు కొట్టేశారు.  ఆ పార్టీ పూర్తిగా వ్యక్తి నియంతృత్వంలో ఉందని అంబటి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా జగన్ మోహన్ రెడ్డిని కలవలేని వాతావరణాన్ని చూసి తాను షాక్ కు గురయ్యానని అన్నారు. అందుకే  వైసీపీ గూటికి చేరిన క్షణం నుంచి ఎప్పుడు బయటకు వద్దామా అని తహతహలాడానని అంబటి వివరించారు. 

పవన్ ల్యాణ్ నాయకత్వ లక్షణాలు, ఆయన ఆశయాలకు ఆకర్షితుడనై జనసేనలో చేరానన్నారు.  రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం  తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడతాయి. ఆ లోగా ఏ పార్టీని విజయం వరిస్తుందన్న అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంతే అంత కంటే ముందు రాష్ట్రంలో విజయం తెలుగుదేశం కూటమిదా? వైసీపీదా అన్న విషయాన్ని సాధికారికంగా ఎవరూ చెప్పే అవకాశం లేదు.
భార‌త‌ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ అయిన‌ ప్రకాశ్ కాప్డే (39).. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి స్వ‌గ్రామానికి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. 
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హింస చెలరేగింది. పోలింగ్ పూర్తి కాకముందే పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల,తాడిపత్రి,చంద్రగిరి,నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫలితాలు వెలువడకుండానే ఓటమి ఖాయమైందని వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఒటేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, కక్షపూరిత పాలనను కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీశారు.
ఓటమి భయంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నాని పులివర్తి నాని అన్నారు.  టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పులివర్తి నాని చెప్పారు.
రాష్ట్రమంతటా ఒకెత్తు.. పాలకొల్లు ఒక్కటీ ఒకెత్తు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామబానాయుడి విజయంపై విపక్ష వైసీపీ అభ్యర్థికి కూడా ఎలాంటి అనుమానం లేదు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ వివ‌రాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంద‌ని తెలిపారు. పోలింగ్ శాతంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. హింస చోటుచేసుకున్న చోట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.
పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారు. ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుంది. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు.
తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.
బాబు సీఎం.. ఫిక్సయిపోండి!
జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.