జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ

Publish Date:May 15, 2024

Advertisement

జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాj ుణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వారికి 2ం2 గన్‌ మెన్‌లను నియమించారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు. జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాయణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు.

By
en-us Political News

  
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం బుధవారం (మే 29) ఉదయం సీఎం చంద్రబాబు అన్న నినాదాలతో మారుమోగిపోయింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతం ఇప్పటికే దిగజారిన ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది.
వారం రోజులు.. సరిగ్గా వారం రోజులు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలిపోతుంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో వెడుతోంది. తన తప్పులు, తప్పిదాలు, తన దౌర్జన్యాలూ, దాష్టికాలూ అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత ఐదేళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయ్యింది.
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మే 29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-7
ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది.
వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది. 
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
 బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా బెయిల్ విషయంలో ఇంకా  క్లారిటీ రాలేదు.   ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు.
బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ఎవర్నయినా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారా? ఎవరూ నోరు ఎత్తకుండా ఆందోళనకారులందర్నీ బూటు కాళ్ళ కింద వేసి తొక్కేశారే... అప్పుడేమయ్యాయి ఈ నీతి సూత్రాలు?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.