జగన్.. పదవి పోయింది.. పార్టీ పొమ్మంటోంది!

Publish Date:Aug 5, 2024

Advertisement

కేవలం ముఖ్యమంత్రి కావాలన్న  లక్ష్యంతోనే జగన్ రాజకీయ ప్రవేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జగన్ ను ఆయన తండ్రి స్థానంలో సీఎం పదవిలో కూర్చోపెట్టేందుకు అంగీకరించని ఒకే ఒక కారణంతో ఆయన సొంత కుంపటి వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన అనుక్షణం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్న ఏకైక లక్ష్యంతో పని చేశారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా, మలి ప్రయత్నంలో అంటే 2019 ఎన్నికలలో ఆయన ఆ లక్ష్యాన్ని సాధించగలిగారు.

ఇక ఆ క్షణం నుంచి ఆ పదవిలో తాను శాశ్వతంగా ఉంటానన్న భ్రమలలోనే గడిపారు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి ఒక రాజు, ఏం అనుకుంటే అది చేసేయచ్చు. నచ్చిన వాళ్లు తప్ప మరెవరూ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. అంతే కాదు.. పార్టీలో కూడా తానే సర్వాధికారి అని భావించారు. ఎవరైనా తన అధికారాన్ని ప్రశ్నిస్తారన్న భయంతోనే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా పార్టీతో ఆమోదింపచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానంటూ ఆయన పంపిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లు బాటు కాదని విస్పష్టంగా తేల్చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క వైసీపీ అనే కాదు ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత పదవులు అనేవి ఉండవని పేర్కొంది.  దీంతో  అప్పట్లో ప్లీనరీ వేదికగా వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించి మరీ  చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. పార్టీ ఆరంభించిన క్షణం నుంచీ కూడా జగన్ కు తన అధ్యక్ష పదవిని ఎవరైనా తన్నుకుపోతారేమోనన్న భయమే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తానే ఉండాలన్న నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ రెండేళ్ల కోసారి పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కేసి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ నింబంధనను వైసీపీ ఎన్నడూ పాటించకపోయినా, పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఈసీ విస్పష్టంగా  తేల్చేసింది.

ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? తన పార్టీ చెప్పుచేతల్లో ఉంటుందో ఉండదో, సీఎం పదవి ఎల్లకాలమూ తానే పట్టుకు వేళాడగలుగుతానో లేదో అన్న భయం జగన్ కు తొలి నుంచీ ఉందని చెప్పడానికే..   పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తన ఎన్నిక అనే లాంఛనాన్ని పూర్తి చేసుకుని, ఆ తరువాత అధికార బలంతో తిమ్మిని బెమ్మిని చేసైనా ఎన్నికల గండాన్ని దాటేసి సీఎంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి జగన్ తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలను 2024 ఎన్నికలలో జనం తిప్పి కొట్టారు. ముఖ్యమంత్రిగానే కాదు, కనీసం విపక్ష నేతగా కూడా తగవు అంటూ వైసీపీకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. సరే సీఎం పదవి ఎలాగూ లేదు.. కనీసం వైసీపీ అధినేతగానైనా ఉంటారా అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ అవకాశం కూడా లేదని అనిపిస్తోంది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ సీనియర్ నేతలంతా దాదాపుగా సైలెంట్ అయి పోయారు. చాలా మంది తన ఆనుపానులు కూడా అధినేతకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.

ఇక యువనేతలైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్ తీరుపై, వ్యవహార శైలిపై, అహంకార పూరిత వైఖరిపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ ఓటమి తరువాత తొట్టతొలిగా జక్కంపూడి రాజా మొదట్లోనే జగన్ తీరుపై  విమర్శలు గుప్పించారు. ఆయన తీరు కారణంగా తాను నిండా మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తరువాత రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు మార్గాని భరత్ జగన్ వ్యవహారశైలిని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. మద్యం విధానం లోపభూయిష్టంగా తయారవ్వడానికి, తప్పులు జరగడానికి జగన్ అజ్ణానమే కారణమన్న అర్ధం వచ్చేలా మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే కోవలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి,  ధర్మవరం   మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు జగన్ కారణంగా తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడిందని బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పై పార్టీలో తిరుగుబాటు మొదలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తిరుగుబాటు రానున్న రోజులలో మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

వైసీపీలో మెజారిటీ నేతలు, కార్యకర్తలు జగన్ తీరుపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు ఎక్కే పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ నుంచి జగన్ ను బహిష్కరించి కొత్త నేతను ఎన్నుకుంటారా? లేక వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలలోకి చేరుతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకూ వైసీపీ నేతలకు జగన్ తీరు, ఆ తీరును సమర్ధించిన కారణంగా ఇతర పార్టీలలోకి ఎంట్రీ లేకుండా పోవడంతో వైసీపీనే జగన్ కు దూరం చేయాలన్న దిశగా ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

By
en-us Political News

  
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇటీవల అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రశన్నకుమార్ రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఈ విషయంలో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి వ్యాఖ్యలపై ఖండనలు వెల్లువెత్తాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి కొత్త అంతరిక్ష విధానాన్ని ప్రకటించిన చంద్రబాబు సర్కార్.. ఈ విధానం అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబునాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు.
బ్యాడ్మింట్ స్టార్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధం నుంచి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సైనా నెహ్వాల్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు.
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డి పల్లె కట్టపస మామిడికాయల లోడ్ తో వెడుతున్న లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 14) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
సెప్టెంబర్ 17.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు. దేశ విదేశీ ప్రముఖులు, అయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెపుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించవచ్చు. ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు.
స్టార్ హోటల్ కిచెన్ తరహాలో ఏర్పాటైన ఈ స్మార్ట్ కిచెన్ లో పని చేస్తున్న వంట కార్మికులు, డ్రెస్ కోడ్ తో పాటు వంట వార్పులలో పరిశుభ్రతా చర్యలు పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాల తయారీ చేపడుతున్నారు. ఆహార రవాణా వాహన ట్రాకింగ్ లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వంటి శాఖల మంత్రులను మనం ఇప్పటి వరకు చూశాం.. కాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా పామ్ ఆయిల్ మంత్రి వచ్చారు..జిల్లాలో ఆయన పామ్ ఆయిల్ సాగుపై దృష్టి సారించారు.
భార్యతో విభేదాల నేపథ్యంలో కోర్టుకెక్కిన ఓ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు తీర్పు విన్నాక ఇంటికి చేరుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేసి తాను ఇక స్వేచ్ఛాజీవినని సంతోషం వ్యక్తం చేశాడు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన ఆమె.. మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి జోరుగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాత్రం అయోమయంలో పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ సీపీఐ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి పోటీచేసి ఓడిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.