మీడియా ముఖ విషకుంభం ‘సాక్షి’!

Publish Date:Aug 5, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్షసాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను ఇటీవల బదిలీ చేసింది. బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుందన్నది స్పష్టమవుతోంది’’ ఇదీ భర్తకి తగ్గ భార్య వైయస్ భారతి సొంత పత్రిక  చిమ్మిన విషం. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన సమయంలో ఇదే భారతి  సాక్షి  పత్రిక, సాక్షి  టి.వి.లో  నాడు చంద్రబాబు  పాలనలో  36 మంది  డియస్పీలకు అక్రమంగా అన్యాయంగా  ప్రమోషన్ కల్పించారు అని  పెద్ద ఎత్తున  ప్రచార దాడి చేశారు.  చంద్రబాబుకు కులపిచ్చితో  తన సామాజిక వర్గం వారికి  మేలు చేయడానికి  నిబంధనలకు  విరుద్దంగా అక్రమాలకు పాల్పడ్డారు అని  నానా యాగీ చేసారు.  అసలు  విషయం  ఏంటంటే,  కేవలం ముగ్గురు డియస్పీలకు 36 మంది అని  తప్పుడు ప్రచారం చేశారు.  ఈ ప్రచారాన్ని తెలుగుదేశం అధినేత  చంద్రబాబు, లోకేష్, ఇతర కమ్మ రాజకీయ నాయకులు ఎవరూ కూడా  ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించిన దాఖలాలు లేవు.  ఫలితంగా  నాడు  ప్రజలను నమ్మించగలిగారు.  అనేక  అబద్ధాల  పునాదులపై  ఒక్క చాన్స్ పేరుతో ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది.  

ఈ ఐదేళ్ళ  జగన్ రెడ్డి  విధ్వంసకర  పాలనలో  అనేక  అమానవీయ  అకృత్యాలకు  స్వయంగా  జగన్ రెడ్డి  పాల్పడ్డారు.  చంద్రబాబు  సామాజిక వర్గం అంటే  దేశద్రోహులు అన్నట్టు  సాక్షాత్తూ  ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి  స్వయంగా  కులం పేరు పెట్టి నాటి  ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ దగ్గర నుండి  డిజిపి హోదా కలిగిన ఎబి  వెంకటేశ్వరావు పదవీ విరమణ చేసే  చివరి రోజు  వరకు  ఎలా వేధించారో  అందరూ చూశారు. ఏపీఎస్ అధికారి గీతా దేవి దగ్గర నుండి  సిఐ, యస్ఐ  స్థాయి అధికారుల వరకు  వేధింపులకు  గురిఅయ్యారు. చివరకు  కమ్మ కుల వ్యాపారస్తులకు  వేధింపులు తప్పలేదు.  ఇక్కడ మీకు  ఒక  ఆస్తక్తికరమైన  కొన్ని  సంఘటనలు  మీకు చెబుతాను.  చార్టెడ్ అకౌంటింగ్‌లో  దేశంలోనే  అగ్రస్థానం సాధించిన ఒక  సిఎ  ఒక శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీని  కలుసుకుని ప్రభుత్వ శాఖల  ఆడిట్ చేస్తాను  అవకాశం కల్పించండి అంటే,  ఆ అధికారి  ఆడిట్ చేయటానికి  మీకు అన్ని అర్హతలు వున్నాయి. కానీ  మీ ఇంటి పేరు  ముఖ్యమంత్రి జగన్ గారికి  ఇష్టం వుండదు అని బదులు ఇచ్చారంట!  గత టిడిపి ప్రభుత్వంలో  చెల్లించాల్సిన  బిల్లులు సైతం  కులం చూసి చెల్లించిన  ప్రభుత్వం  నాటి  జగన్  ప్రభుత్వం.  వికృత  కాలకూట  కుల  ద్వేషం, వ్యక్తిత్వ హననానికి అంతే లేకుండా పోయింది. దమన నీతి పాలన సాగింది.  నిలువెల్లా విషం నింపుకుని  రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది.  నిజం కాదా?   వేల మందికి  ఉపాధి కల్పించే  అమర్ రాజా కంపెనీని మేమే పొమ్మని  పంపించేశాం అని  ముఖ్యమంత్రి  సలహాదారు సజ్జల  నిర్లజ్జగా  బరితెగించి  ప్రకటన  చేయటాన్ని  ఎలా  చూడాలి? దాన్ని ప్రజా పాలన  అందామా?   

యాబై ఏళ్ళ పాటు   రాజకీయ  రెడ్ల చేతుల్లో  అధికారం  వుంది  రాయలసీమకు  వీళ్ళు  వరగబెట్టింది ఏంటి? కోస్తా  ఆంధ్ర  ఉత్తరాంద్ర  ప్రజలకు  తవ్వి తలకెత్తింది  ఏమైనా ఉందా? కులాన్ని  అడ్డం పెట్టుకుని  రెడ్డి  కులానికి  వీళ్ళు  చేసిన  మేలు ఏంటి!   జగన్  ఏలుబడిలో  జగన్  చుట్టూ  వున్న   ఆ వెయ్యి మంది  రెడ్లకు  తప్ప   రెడ్డి కులానికి  ఈయన గారు  చేసిన  మేలు  చెప్పగలరా?   రెడ్డి  కులానికి మేలు  చేయకపోగా  అంతులేని  కీడు  జగన్ ప్రభుత్వం చేసింది. కమ్మ కులాన్ని ద్వేషించటం వేధించడం రెడ్లను  సంతృప్తిపరచడం కోసమే  అనే  వికృత  మనస్థత్వంతో   పాలన  సాగింది.  ఈ మోడల్‌లో ఒక్క రెడ్డి కుటుంబం  బాగుపడిన  పరిస్థితి వుందా?  ఈయనగారి  ప్రభుత్వంలో   పనులు చేసిన  రెడ్లకు  బిల్లులు  చెల్లించకపోతే  ఆ  కుటుంబాలు  రోడ్డున పడ్డాయి. రెడ్లు  ఆస్తులు   అమ్ముకున్నారు. 

మాచర్ల పిన్నెల్లి  రామకృష్ణా రెడ్డిని   ఉత్తముడు అని నిసిగ్గుగా, వెరపు లేకుండా అలవోకగా ఆశుద్దం మాట్లాడటం  జగన్  నైజం. మాచర్ల   ఒక చంబల్ లోయ. పిన్నెల్లి  అరాచకాలకు  భయపడి  ఊళ్ళకు ఊళ్ళు జనం ఇళ్ళకు  తాళాలు వేసుకుని   పరాయి పంచన  బిక్కుబిక్కుమంటూ  ప్రాణాలు  అరచేతిలో పెట్టుకుని  ఐదేళ్ళపాటు  భయం  నీడలో  గడిపారు. ఆఖరికి మొన్న  ఎన్నికల్లో  ఎన్నికల కమీషన్ బిందుమాధవ్ అనే   ఒక  నిప్పుకణికను  పల్నాడు యస్‌పిగా  నియమించింది.   ఎన్నికల్లో  పిన్నెల్లి హింస ఏస్థాయిలో  జరిగిందో  చూశాం. బిందుమాధవ్‌కు  క్రింది స్థాయి  సిబ్బంది  సహాయ నిరాకరణ చేశారు.  కారణం  వారంతా  పిన్నెల్లి నియమించుకున్న దళం. నాటి  డీజీపీ కసిరెడ్డి  రాజేంద్రనాథ్‌కి ఎస్పీ బిందుమాధవ్  ఎంత చెప్పినా  పట్టించుకోలేదు.  పైపెచ్చు  అల్లర్లు  జరిగే గ్రామాల్లో  మాధవ్ బైండోవర్  చేస్తుంటే వారిని  వదిలిపెట్టు అని  పోలీస్  సెట్లో చెప్పారంటే  ఎంత బరితెగింపు. బిందుమాధవ్  చురుకైన  అధికారి  అతని  ట్రాక్ రికార్డు  మచ్చలేనిది.  అనేక  రివార్డులు  ఆయన సొంతం. కానీ నాటి చీఫ్ సెక్రటరీ  జవహర్ రెడ్డి  మాధవ్‌ను  సస్పెండ్ చేయించారు.  జగన్  ఏలుబడిలో మాధవ్ కంటే  జూనియర్స్‌కు  లా అండ్  ఆర్డర్  పోస్టింగ్‌లు  ఇచ్చి  మాధవ్‌ని అప్రధాన్య పోస్టులకే పరిమితం చేసారు.  కారణం  ఏంటి అనుకుంటున్నారు?  మీరు  అనుకునేది  మాత్రం కాదు!  బిందు మాధవ్ కమ్మ కులం కాదు  బ్రాహ్మణ సామాజికవర్గం  మరి అయితే  వేధింపులకు  కారణం  ఏంటి? బిందు మాధవ్ ప్రేమ వివాహం  చేసుకున్నారు.  మాధవ్  శ్రీమతి  కమ్మ సామాజిక వర్గం.  ఆమె  ఒక ప్రముఖ  సైంటిస్ట్. మన రాష్ట్రంలో కూడా  వుండరు  కేంద్ర ప్రభుత్వ శాఖలో  పని చేస్తారు.  ఇప్పుడు చెప్పండి  ఈ వికృత  ఆటవిక పాలనకు  ఏ పేరు  పెడదాం?  

పవన్ కళ్యాణ్‌ను ఆయన  సామాజిక వర్గం  వారితో  బండ బూతులు  తిట్టించడం, వ్యక్తిగత  దాడి చేయటం  మనం  చూశాం. మాజీ  మంత్రి పేర్ని  నాని  నాలుగు  అడుగులు  ముందుకేసి,  మా  కాపు నాకొడుకులు అనడం! అవును  నేను  జగన్  గారికి  పాలేరునే  అనడం మనం  చూశాం. మొత్తానికి ఐదేళ్ళ  జగన్ పాలనలో  వ్యవస్థల విధ్వంసం కళ్ళారా చూశాం!  ఆ పైన  ఘనమైన ప్రజా తీర్పు చూశాం. మళ్లీ  మళ్లీ  జగన్ రాకాసి మూక  వారి కరపత్రం  జగన్  శ్రీమతి  భారతి  నడిపే  పత్రికలో  అవే రోతరాతలు  అవే  కుల వైషమ్యాలు.  ఇటీవల మొత్తం  96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.  అందులో  54 మందికి  పోస్టింగ్ ఇవ్వలేదు.  ఎందుకు ఇవ్వలేదు  అంటే,  ఈ  ఐదేళ్ళ సీమ పాలెగాడి  వికృత పాలనలో  వీళ్ళు అనేక  అకృత్యాలకు  పాల్పడ్డారు.  54 మందిలో  15 మంది  రెడ్డి కులస్తులు వున్నారంట!  వారిని  చంద్రబాబు  పక్కన పెట్టారంట!  రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు వేధించడానికి  సిద్దమయ్యారంట... ఇది  సాక్షి కథనం.  

దీంట్లో  మొదటి  విషయం...  అధికారుల్లో  కూలాలను  చూడటం ఏంటి?  54 మందికి  పోస్టింగ్ ఇవ్వకపోతే  ఆ 15 మంది  ప్రస్థావన ఎందుకు?  ఆ 54లో  15 మంది  కాకుండా  మిగతా 39 మంది ఎవరు?  ఆలస్యం ఎందుకు  మరి  వాళ్ళ కులపోళ్లను  కూడా రెచ్చగొట్టండి!  మీరు పాలించేటప్పుడు మీకు  పాలేర్లు కావాలి!  అధికారం పోగొట్టుకున్నా కూడా  ఆ పాలేర్లే  అధికారులుగా  కొనసాగాలని  జగన్ పత్రిక  కోరుకుంటుంది. నేటికి  అనేక మంది  నిజాయితీ పరులైన  రెడ్డి  సామాజిక వర్గం  అధికారులు అనేక మంది  కూటమి  ప్రభుత్వంలో  కీలక పదవులు నిర్వరిస్తున్నారు. గతంలో  కులాన్ని ‘చూషి’, ‘షేషిన’ పాలన చూశాం.  నేడు  అదే కులం  ముసుగులో  రెడ్లకు  న్యాయం చేయడానికి బయలుదేరారు. నమ్మండి ప్లీజ్  చివరగా  ఒక్క  విషయం గుర్తుంచుకోండి  రాజకీయ  రెడ్లు వేరు!  రెడ్డి కులం వేరు! రాజకీయ  కమ్మలు వేరు  కమ్మ కులం వేరు.  రాజకీయ నాయకులను మా కులం అని  చంకలు గుద్దుకోకండి.  వారందరిది  రాజకీయకులం.  యాబై ఏళ్ళ రెడ్ల  పాలనలో  రెడ్డి కులం  ఏం బాగు పడింది? టీడీపీ పాలనలో  నాశనమైన  కమ్మవాళ్ళతో  పోలిస్తే  బాగుపడిన వారు  అరడజను  మించి వుండక పోవచ్చు.  ప్రజలు  ఆలోచించాల్సింది  కులాలు కాదు  వారి  పిల్లల  బంగారు  భవిష్యత్తుకు  బాటలు  వేసే పాలకుల కోసం ఆలోచన చేయాలి.

By
en-us Political News

  
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కడప నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి మునిసిపల్ కార్పొరేషన్ లో జెండా ఎగురవేసేందుకు తెలుగుదేశంపార్టీ శ్రేణులన్ని కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి పిలుపు నిచ్చారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ పల్నాడు రెంటపాళ్ల గ్రామ పర్యటన సందర్బంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించ తలపెట్టిన పోలవరం-బసకచర్ల ప్రాజెక్టును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును తిరస్కరించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో ఫాస్టాగ్ యాన్యూవల్ పాస్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ ద్వారా తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతున్నది.
ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ రిలీజ్ చేసింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద ర్యాలీలో తొక్కిసలాట జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. మళ్లీ, మళ్లీ విచారణకు పిలుస్తున్నారు. గంటలకొద్దీ ఎంక్వైరీ చేస్తూ.. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్ర కానీ, ఆ దేశ అధ్యక్షుడి పాత్ర కానీ ఇసుమంతైనా లేదని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే చెప్పారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ దాదాపు పాతిక నిముషాలు సాగింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.