పారిపోండిరోయ్‌.. రెడ్‌బుక్ ఓపెనవుతోంది !

Publish Date:Aug 16, 2024

Advertisement

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏపీలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌జ‌లు, వ్యాపారులు ధైర్యంగా త‌మ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. బెదిరింపులు, అక్ర‌మ అరెస్టులు, పోలీసుల అర్ధరాత్రి దాడులు, గోడలు దూకి, తలుపులు పగులగొట్టి తీసుకువెళ్లడాలు  క‌నుమ‌రుగ‌య్యాయి. పాల‌నా ప‌రంగా అపార అనుభ‌వం క‌లిగిన సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది.  రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఊపందుకోనున్నాయి. మ‌రోవైపు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ అమ‌లు పైనా ప్ర‌భుత్వం దృష్టిసారించింది. ఇప్ప‌టికే కొన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోన్న ప్ర‌భుత్వం..  తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించింది. ఒక‌ ప‌క్క రాష్ట్ర  అభివృద్ధిపై దృష్టిపెడుతూనే.. మ‌రోప‌క్క గ‌త వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ు, దౌర్జ‌న్యాలు, భూక‌బ్జాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌లు, వారికి స‌హ‌క‌రించిన అధికారుల‌పై చంద్ర‌బాబు కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు అయ్యాయి,  అరెస్టులు కూడా జ‌రిగాయి. త్వ‌ర‌లో మంత్రి నారా లోకేశ్ కూడా రంగంలోకి దిగ‌నున్నట్లు తెలుస్తోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న రెడ్ బుక్ లో చ‌ట్టం ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లు, అధికారుల పేర్ల‌ను న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం లోకేశ్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయ‌బోన్నారు‌. దీంతో వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లు, కొంద‌రు అధికారులు విదేశాల‌కు పారిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.  

రెడ్‌ బుక్ పేరు వింటే వైసీపీ నేత‌లు, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంలో తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై పెద్ద ఎత్తున వైసీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ప‌లు ప్రాంతాల్లో తెలుగుదేశం జెండా క‌ట్టిన నేత‌ల‌ను హ‌త్య‌లు సైతం చేశారు. పోలీసుల‌కు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. దీంతో ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో తెలుగుదేశం జెండా ప‌ట్టుకునేందుకు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి తోడు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల భూముల‌ను ఆక్ర‌మించ‌డం, ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం వంటి దారుణాలు జగన్ హ‌యాంలో నిత్య‌కృత్యంగా కొన‌సాగాయి. దీంతో ప్ర‌జలు సైతం వైసీపీ నేత‌ల‌కు ఎదురు నిల‌బ‌డే సాహ‌సం చేయ‌లేక పోయారు. అప్ప‌ట్లో నారా లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌నూ అడ్డుకునేందుకు జగన్ ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. ప్ర‌భుత్వ  కుట్ర‌ల‌ను ఎదుర్కొని లోకేశ్ పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ఈ పాద‌యాత్ర ప్రారంభం నుంచే వైసీపీ ప్ర‌భుత్వంలో చ‌ట్టానికి విరుద్దంగా న‌డుచుకున్న నేత‌లు, అధికారుల పేర్ల‌ను లోకేశ్ రెడ్‌బుక్‌లో రాయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి నుంచి ఎన్నిక‌ల్లో చివ‌రి ప్ర‌చార స‌భ వ‌ర‌కు లోకేశ్‌ రెడ్ బుక్ మెయింటెన్ చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత రెడ్ బుక్ లో పేర్లు ఉన్న   వైసీపీ నేత‌లు, అధికారుల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని, చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని లోకేశ్ ప్ర‌తీ స‌భ‌లో చెబుతూ వ‌చ్చారు. అప్పట్లో లోకేశ్ రెడ్ బుక్ ను లైట్ గా తీసుకున్నవారు.. ఇప్పుడు రెడ్ బుక్ అంటేనే వ‌ణికిపోతున్నారు.

 కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రం అభివృద్ధిప‌థంలో దూసుకెళ్తున్నది. మ‌రోవైపు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు, భూక‌బ్జాల‌కు, చ‌ట్టం ప‌రిధిదాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌ల‌పైనా, వారికి స‌హ‌క‌రించిన అధికారుల‌పైనా కొర‌ఢా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అవినీతిపై విచార‌ణ  సాగుతోంది. మాజీ మంత్రి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రేష‌న్ బియ్యం దందాపైనా విచార‌ణ జ‌రుగుతోంది. అంతేకాదు.. దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, ర‌ఘురాం త‌దిత‌రులపై తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడికి సంబంధించి కేసులు న‌మోదు కాగా.. బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. అగ్రిగోల్ట్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టు అయ్యారు. అదే కేసులో జోగి ర‌మేశ్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. పులివ‌ర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి కుమారుడిపై విచార‌ణ జ‌రుగుతుంది. ఇలా చాలా మందిపై కేసులు ఉన్నాయి. అయితే, ప్ర‌తీకేసు క‌క్ష‌ సాధింపు అంటూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌గ్గోలు పెడుతున్నారు. లోకేశ్‌ రెడ్ బుక్ ప్ర‌కార‌మే ఇదంతా జ‌రుగుతుందంటూ ఢిల్లీ ధ‌ర్నాలోనూ గ‌గ్గోలు పెట్టారు. కానీ, రెడ్ బుక్ ఇంకా తెరుచుకోలేద‌ని లోకేశ్, టీడీపీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో చెబుతూ వ‌చ్చారు. 

రెడ్ బుక్‌పై తాజాగా మంత్రి లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు జిల్లాలో అన్న క్యాంటిన్ ప్రారంభం త‌రువాత లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ గురించి ప్ర‌స్తావించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఊళ్లో రెడ్‌ బుక్‌ మీద ప్రజలకు తాను హామీ ఇచ్చానని అన్నారు. ప్రజలకు ఎర్ర బుక్ చూపించి ప్రతి తప్పుపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చానని, ఆ మాటల్ని ఎన్నికల్లో ప్రజలు నమ్మారని, రెడ్‌ బుక్‌ మ్యాండేట్ ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో త్వ‌ర‌లో రెడ్ బుక్ తెరుచుకోబోతుంద‌ని లోకేశ్ చెప్ప‌క‌నే చెప్పారు. లోకేశ్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ హ‌యాంలో చ‌ట్టానికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ నేత‌లు, అధికారులు వ‌ణికిపోతున్నారు‌. దీంతో రెడ్ బుక్ తెరుచుకోక ముందే దేశం వ‌దిలి పారిపోయేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లు, అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

By
en-us Political News

  
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.