పోలీసులకు వైసీపీ నేత డబ్బుల ఎర.. అడ్డంగా బుక్కయ్యారు

Publish Date:Feb 7, 2019

Advertisement

 

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేయడం సహజం. అయితే ఏపీలో కొందరు నేతలు ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ఏకంగా పోలీసులకే డబ్బు ఎర వేసి ప్రలోభాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ సంఘటన మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఆయనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ ప్రలోభాలకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం వైసీపీ కన్వీనర్‌ వసంత కృష్ణ ప్రసాద్‌ తన అనుచరుడు మాగంటి వెంకట రామారావు ద్వారా జీ.కొండూరు, మైలవరం పోలీస్ స్టేషన్లకు నగదును పంపారని తెలుస్తోంది. తమకు వెంకట రామారావు అనే వ్యక్తి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ మైలవరం, జీకొండూరు ఎస్సైలు శ్రీనివాసరావు, ఎండీ అష్ఫక్‌ బుధవారం ఫిర్యాదు చేయడంతో ప్రలోభాలపర్వం వెలుగులోకి వచ్చింది.
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ ప్రసాద్‌ అనుచరుడు వెంకట రామారావు మంగళవారం ఉదయం జి.కొండూరు, మైలవరం పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐలకు ఫోన్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో కృష్ణ ప్రసాద్‌కు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఇందుకుగాను ఆయన డబ్బులు పంపారని, వాటిని అందించేందుకు కలుస్తానని చెప్పారు. డబ్బులు తీసుకునేందుకు ఎస్సైలు తిరస్కరించారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని వెంకట రామారావును హెచ్చరించారు. ఇదే విషయాన్ని స్టేషన్‌ జనరల్‌ డైరీలో నమోదు చేసి, తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అదే రోజు మధ్యాహ్నం రామారావు ఆ పోలీసుస్టేషన్లకు వెళ్లి ఎస్సైల గురించి వాకబు చేయగా, వారు అక్కడ లేరని తెలిసింది. దీంతో నేరుగా వారి ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కవర్‌ తీసుకునేందుకు వారిద్దరూ నిరాకరించారు. తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన రామారావుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు బుధవారం మైలవరం, జి.కొండూరు పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. రామారావు పోలీసుస్టేషన్లకు వెళ్లి వాకబు చేసిన ఉదంతానికి సంబంధించిన ఫోన్‌ డేటా రికార్డులను, సీసీ టీవీ ఫుటేజీలను ఆ ఎస్సైలు సేకరించారు. వాటి ఆధారంగా రామారావుపై కేసు నమోదుచేసినట్టు మైలవరం సీఐ సూరిబాబు తెలిపారు.

అయితే అధికార పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే తమ నేతలను ఇరికిస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మంత్రి దేవినేని ఉమ ఒత్తిళ్ల కారణంగానే ఎస్సై తమపై తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై ఫిర్యాదు చేసినందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అయితే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు మాగంటి వెంకట రామారావు జీ.కొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు విడుదల చేయడంతో వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.