130, 90, 30, 15.. ఇవి ర్యాంకులు కావు.. పడిపోతున్న వైసీపీ సీట్లు!

Publish Date:Sep 22, 2023

Advertisement

వైనాట్ 175 ఇదీ కొద్ది కాలం కిందటి  వరకూ ఏపీలో అధికార వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు.  స్వయంగా సీఎం జగన్ రెడ్డి ప్రదర్శించిన ధీమా.  ఔను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకూ అంతా వైనాట్ 175 అంటూ  తమ భుజాలు తామే చరుచుకునే వారు. ఒక దశలో వైనాట్ 175 అనేది ఒక నినాదంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని కూడా చూశారు.  కానీ    వైసీపీ  చేయించుకున్న సొంత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేలు, గడప గడపకి వైసీపీ లాంటి కార్యక్రమాలలో ప్రజలలో వ్యతిరేకత చూసిన వైసీపీ నేతలలో సౌండ్ తగ్గిపోయింది. వైనాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టిన వైసీపీ నేతలు కాస్త సీట్లు తగ్గినా  మాదే అధికారం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతకు ముందు వైనాట్ 175 అన్న సీఎం జగన్ మోహన్ రెడ్డే మళ్ళీ అదే నోటితో  ‘సంఖ్య త‌గ్గినా.. నేనే సీఎం' అని వ్యాఖ్యానించారు. 

గత ఎన్నికలలో వైసీపీ 151 స్థానాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.  ముందుగా వైనాట్ 175 అన్న వైసీపీ నేతలు ఆ తర్వాత ఈసారి 130కి పైగా స్థానాలతో మాదే విజయం అంటూ ప్రకటించారు. సాక్షాత్తు జగనే సంఖ్య త‌గ్గినా.. నేనే సీఎం అంటూ వ్యాఖ్యానించగా.. 120 స్థానాల‌లో త‌మ పార్టీ గెలుస్తుంద‌ని.. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక‌రు ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానించారు.  వైసీపీ చేయించుకున్న కొన్ని సర్వే సంస్థలు ఆ మధ్య వైసీపీ 90 స్థానాలకే పరిమితం అవుతుందని నివేదికలు ఇచ్చాయి ఇచ్చాయి. అయితే గత మూడు నెలల కాలంలో  అధికార పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. అంతకంతకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు తోడు ప్రభుత్వం నిలకడ లేని నిర్ణయాలు..  కక్షపూరిత రాజకీయాలు ప్రజలలో విసుగుపుట్టిస్తున్నాయి.  ఫలితంగా వైసీపీకి ఈసారి 30 స్థానాలు రావడమే గగనమని ఆఫ్ ది రికార్డ్ గావైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

వైనాట్ 175తో మొదలైన వైసీపీ ప్రకటనల ప్రస్థానం ఇప్పుడు చివరికి 15 స్థానాల స్థాయికి దిగజారింది. నెల్లూరు జిల్లా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్యనే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ, జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని,  వైసీపీకి ఈసారి 15 సీట్లు దక్కడమే మహా భాగ్యం అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి 57 శాతం ఓట్లు తెచ్చుకుటుందని చెప్పిన కోటం రెడ్డి.. గతంలో తాను చెప్పినవన్నీ జరిగాయని.. ఇప్పుడు కూడా జరగబోయేది ఇదేనని బల్లగుద్ది చెప్పారు.  దీంతో కోటం రెడ్డి వ్యాఖ్యలపై చర్చలు జరుగుతున్నాయి. వైసీపీకి  ఘోర పరాజయం తప్పదన్న కోటం రెడ్డి జోస్యం వెనక ఉన్న బలమైన కారణాలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో  వైసీపీ గ్రాఫ్ దాదాపు పాతాళానికి పడిపోయిందన్నది  విశ్లేషకుల మాట. యువత ఉపాధి కోసం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ లో వైసీపీ ప్రభుత్వానికి స్కాం కనిపించడం, రిటైర్డ్ అధికారుల నుండి.. మాజీ న్యాయమూర్తుల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును తప్పుబట్టడం, ఏపీ నుండి అమెరికా వరకూ నిరసనలు, జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతు.. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు మరికొన్ని   కేసులు కూడా బనాయించడం, పీటీ వారెంట్లు, చంద్రబాబును జైలుకే పరిమితం చేస్తామన్న వైసీపీ నేతలు ప్రకటనలు,  లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామన్న బెదిరింపులు ఇలా ఎన్నో అంశాలపై ప్రజలలో చర్చ జరుగుతుంది. జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజలలో నెలకొన్న అభిప్రాయాలూ, టీడీపీ,జనసేన పొత్తుతో మారిన సమీకరణాలు.. ఇలా అన్నీ కలిసి ఈసారి టీడీపీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టడం ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.   మొత్తం మీద తమ గ్రాఫ్ వేగంగా పతనమౌతోందని స్వయంగా వైసీపీ నేతలే ఓపెన్ గా ప్రకటించడం కొసమెరుపు. 

By
en-us Political News

  
చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి లీగల్ నోటీసులు పంపారు.
ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమణం నెలకొంది. రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు.
బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా.. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది.
అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో మరో మహోత్తర ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది.
స్వర్ణాంధ్ర విజన్–2047 పక్కగా అమలు చేసేందుకు కుటమి ప్రభుత్వం చర్యలు చేపటడుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది.
చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
బోయింగ్ డ్రీమ్‌లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్‌వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణీకులు భయపడే పరిస్థితులు నొలెకొన్నాయి.
కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా, పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత.
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూటమి సర్కార్ అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత, మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.