వైసీపీ బరితెగించేసింది.. తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా ఉండాల్సిందే!

Publish Date:Apr 16, 2024

Advertisement

ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఏం చేసైనా గెలుపు సొంతం చేసుకోవడమే లక్ష్యం అంటూ వైసీపీ బరితెగించేసింది.   తన అస్తిత్వం, ఉనికి ప్రమాదంలో పడిందని భావించినప్పుడు సామాన్యులు కూ ఎంతో కొంత తెగిస్తాడు. అయితే  పరిమితులు, హద్దులు చెరిపేసి మరీ చేసే అరాచక విన్యాసాన్ని బరితెగింపు అంటాం. ఇప్పుడు గెలుపు తలుపులు అన్నీ మూసుకు పోయాయి అని అర్ధమైన తరువాత వైసీపీ అధినేత జగన్, ఆయన కోటరీ బరితెగించేశారు.   ఏదో సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. పది మంది మంచి కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని.. ఇప్పుడు వైసీపీ మంచి కోసం కాదు, తన ఉనికి కోసం అలాంటి బరితెగింపును ఆశ్రయించింది. దానినే ప్రదర్శిస్తున్నది.   ధర్మాధర్మాలూ నీతినియమొలూ ఉచితానుచితాలూ పెద్దాచిన్నా స్వపరభేదాలూ సమయాసమయాలూ ఏమీ లెక్కచేయడం లేదు. రాష్ట్రం, జనం ఏమైపోయినా, ఏమనుకున్న ఫరవాలేదు.. గెలస్తే చాలు అన్నట్లుగా బరితెగించి వ్యవహరిస్తున్నది.  

జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం, ఆ తరువాత సొంత పార్టీ ఏర్పాటు, అధికారపగ్గాలు అందుకోవడం ఇలా అన్ని విషయాలలోనూ బరితెగింపునే ఆశ్రయించారని చెప్పాలి.    తన తండ్రి హఠాన్మరణం తరువాత ఆయన కుమారుడిగా ముఖ్యమంత్రి పీఠం సహజంగా తనదే అవుతుందని భావించారు. దానిని అందుకోవడానికి బరితెగించి ఆయన పార్ధివదేహం  పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ ఆరంభిచారు. సానుభూతి పవనాల పల్లకీ మరొకరు ఎక్కకుండా ముందే విజ్ఞులు ఛీ అంటారని కూడా లెక్కచేయకుండా ముందుకు దూకి పార్టీ అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించారు. అయితే అధిష్ఠానం ఆ ఒత్తిడికి తలొగ్గకపోవడంతో కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి వైసీపీని ఆరంభించేశారు.   అదీ ఒక విధంగా బరితెగింపే. 

సరే  ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి   అడుగులు వేశారు.  తండ్రి కాలధర్మం చెందిన తరువాత ఓదార్పుయాత్ర పేరుతో ఆయన చేసిన విచిత్రం కూడా బరితెగింపే.   రాజశేఖర రెడ్డి గారి ళమరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వేలాదిమంది లక్షలాది మంది మరణించారు అని ప్రచారం చేసి వాళ్ళందరినీ ఓదార్చడం కోసం సుదీర్ఘయాత్ర చేసారు.  మహాత్మాగాంధీ హత్యానంతరం కూడా దేశంలో వేలాది గుండెలు ఆగిపోలేదు. కాని రాజశేఖర రెడ్డి   మరణం వలన వేలాది గుండెలు ఆగాయంటూ, సహజ మరణాలను కూడా  ఆ జాబితాలో వేసుకోవడానికి  జగన్ ఇసుమంతైనా వెనుకాడలేదు.  తండ్రి మరణం తరువాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తరువాత ఎన్నికలలో జగన్ రెడ్డికి ఓదార్పు యాత్ర ఫలం దక్కలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత నుంచే జగన్  తనదైన మార్క్  రాజకీయాలకు తెరలేపారు. ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టడం, వారి సానుభూతి కోసం ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం కనిపించింది. 

గత ఎన్నికల ముందు కోడి కత్తి దాడి, సొంత బాబాయ్ వివేకా హత్య సంఘటనలను తనకు అనుకూలంగా మలచుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అధికారపగ్గాలు అయితే అందుకున్నారు కానీ జగన్ అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో ఆయన పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది.  ఆయన సర్కార్ జారీ చేసిన దాదాపు ప్రతి జీవోనూ కోర్టులు తప్పుపట్టాయి. ప్రతి నిర్ణయాన్నీ తప్పుపట్టాయి. ఇలా న్యాయస్థానాలలో ఇన్ని మొట్టికాయలు తిన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. జగన్ పాలన అంతా   ప్రతిపక్షాలను సాధించడం, ఆ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ప్రాజెక్టునూ నిర్వీర్యం చేయడంతోనే సరిపోయింది. ప్రజల ఆంకాంక్షల గురించిన పట్టింపు లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ గెలవడం తప్ప మరో లక్ష్యం లేదు జగన్ కు.  తన పాలన చూసి ఎవరూ ఓటు వేయరన్న విషయాన్ని ముందే గ్రహించిన జగన్ జనాలను బెదరించి ఓట్లు వేయించే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల డేటా మొత్తం వారి గుప్పెట్లో పెట్టి బెదరించో, బెల్లించో ఓట్లు దండుకునేందుకు వ్యూహం పన్నారు. ప్రజాప్రతినిథ్య వ్యవస్థలో అసలు చోటే లేని వ్యవస్థ ను తీసుకువచ్చి పార్టీ కార్యకర్తలకు వాలంటీర్లని పేరుపెట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు ప్రజాధనం నుండి ఎలా చెల్లిస్తారు? వాళ్ళు ఎన్నకైన ప్రజాప్రతినిధులనూ లెక్కచేయనంత పెత్తనం ఎలా చెలాయిస్తారు. ఇదంతా బరి తెగింపే కదా? ఈవాలంటీర్లసైన్యం వెనుక ఉన్ఞ లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రతిపక్షాలనూ ఫ్రజలనూ భయోత్పాతానికీ అభద్రతకూ గురిచేయటం. తన అధికారాన్ని తిరుగులేకుండా చేసుకోవడానికే.    అయితే జగన్ బరితెగింపునకు ఎన్నికల సంఘం స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరం చేసింది.

దీంతో ఇక జగన్ ఎన్నికలలో విజయం కోసం ఇంకెంత బరితెగిస్తారో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  వచ్చే ఎన్నికలలో జనం స్వేచ్ఛగా, నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు లేకుండా చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇప్పటికే ఓట్ల జాబితాలో ప్రతిపక్షానికి చెందిన వారి ఓట్లు వేల సంఖ్యలో మాయ మయ్యాయని, అలాగే పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయనీ అంటున్నారు. జగన్ తన కోసం తన చేత తానే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారన్న విమర్శలు ఉన్నాయి. సరే ఓటర్ల జాబితాల సవరణలు, అవకతవకలకు పాల్పడిన, అందుకు దోహదపడిన అధికారులపై చర్యలు అంటూ ఏదో ఓ తంతు జరిగినా ఇప్పటికీ ఓటర్ల జాబితాలో అవకతవకలను పూర్తిగా సరిదిద్దలేదన్నదే పరిశీలకుల విశ్లేషణ. ఇంత ఆలస్యంగా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం దొంగలు ఇంట్లో పడ్డాకా తలుపులు మూసిన తంతులా ఉందని అంటున్నారు.

అసలు జగన్ వై నాట్ 175 అనడంలోనే బరితెగింపు  ఉందని పరిశీలకులు అంటున్నారు. నోరెత్తే మనిషి లేకుండా చేసి, వ్యతిరేకించే వారి గొంతు నొక్కేసి , జనాల స్వేచ్ఛను హరించేసి, తన పార్టీకి ఓటు వేసే వాళ్లు మాత్రమే పోలింగ్ బూత్ వద్దకు చేరేందుకు వీలుగా శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించేందుకు కూడా జగన్ వెనుకాడరని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజుల తరువాత కూడా రాష్ట్రంలో విపక్షాలపై దాడులు యథేచ్ఛగా జరుగుతుండటం ఇందుకు ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో  సర్వేల ఫలితాలు, తమ సభలకు వస్తున్న జన స్పందన చూసి విజయంపై ధీమాతో ప్రమత్తంగా ఉండకుండా తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా వ్యవహరించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవలసిన ప్రమాదం ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి
దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు. 
ఎన్నికల వేళ ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.  
ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు.
వల్లభనేని వంశి నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ కు ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. అంతుకు ముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే, జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది
చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు..
​వనపర్తి జిల్లా భూత్పూరు గ్రామానికి చెందిన రైతు శేఖర్ ఆదివారం నాడు తన పొలానికి
ఏపీ ఊడిపోయే సీఎం జగన్ మొన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టే విడుదల కార్యక్రమాన్ని సౌండ్ మ్యూట్
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.